కొంతమంది దేవుడి పేరు చెప్పి విచిత్రంగా ప్రవర్తించే వారు చాలామంది ఉంటారు. నాకు కలలో దేవుడు చెప్పాడు అందుకే ఇలా చేస్తున్నాను అంటూ చెబుతూ నేరాలకు పాల్పడుతున్న వారు చాలా మందే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ నేరానికి పాల్పడిన నిందితుడు... దేవుడు చెప్పాడు అంటూ తనపై తాను దాడి చేసుకున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాకు దేవుడు చెప్పాడు అంటూ ఏకంగా తన మర్మాంగాన్ని కోసుకొని విచిత్రంగా ప్రవర్తించాడు. ఇక ఆ ఖైదీ ప్రవర్తనతో ఆ పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

 

 

 ఈ విచిత్రమైన ఘటన గ్వాలియర్  జైలు లో చోటుచేసుకుంది. విష్ణు సింగ్  అనే వ్యక్తి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక మంగళవారం నాడు ఆ వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. ఇక ఇది గమనించిన జైలు అధికారులు...హుటాహుటీన అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం  ఏమైంది అని సదరు వ్యక్తి ని అడగగా.... తనకు రాత్రి శివుడు ప్రత్యక్షమై తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడని... అందుకనే తన పురుషాంగాన్ని కోసేసినట్లు జైలు అధికారులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు పోలీసు అధికారులు. తాను రోజు భోజనం చేసే చెంచాను  పదునుగా మార్చి దానితోనే మర్మాంగాన్ని  కోసుకున్నట్లు జైలు అధికారులతో తెలిపాడు. 

 

 

 అయితే తన మర్మాంగాన్ని కోల్పోయినందుకు తాను చింతించడం లేదు అంటూ ఈ సందర్భంగా ఆ ఖైది చెప్పాడు. అయితే ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన అధికారులు వెంటనే అతని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ తెలిపిన అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన మొత్తం విషయాన్ని పోలీస్ అధికారులకు సదరు వ్యక్తి తెలిపినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: