మనం మనుషుల మండి.. తోటి వారిని ఆదుకోవాలనే ఇంకిత జ్ఞానం కొంచమైనా ఉండాలి.. ఏదైనా చేసిన సాయం పైకి చేప్పకూడదని అలాంటిది ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ గుండు పిన్ను సాయం చేసిన కూడా మనకు మళ్లీ గుర్తుకు రాకూడదని అంటారు ..కానీ ఈ మధ్య  ఫ్యాషన్ అయిపోయింది.. క్రేజ్ కోసం దేనికైనా సరే సిద్ధపడుతున్నారు.. 

 

 

 

 

 

ఇకపోతే ప్రస్తుతం భారత దేశాన్ని భయపెడుతున్న కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.. పేద ప్రజలను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు.. రెక్కాడితే కానీ డొక్కాడని చీకటి బ్రతుకులను చిన్నాభిన్నం కాకుండా చూస్తున్నారు.కొందరేమో చేసిన సాయాన్ని మర్చిపోతే.. మరికొందరు మాత్రం అందరికీ తెలిసేలా చేస్తున్నారు.. సాయం చేస్తూ సెల్ఫీ తీసుకుంటున్నారా.. ఇవి ఓపారి చూడండి.. 

 

 

 

 

 

ఎంత పెద్ద వారైన కూడా పేదలను ఆదుకుంటో ఫోటో లు తీసుకుంటే చట్ట రీత్యా నేరమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి.. అంతేకాదు.. అలా చేస్తూ ఎవరైనా బయట కనిపిస్తే ఇంక పోలీసులు లాఠీలకు పని చెప్తారు..మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటిది లేదులేండి..నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో అలాంటివి కఠిన తరంగా చేశారు...

 

 

 

 

 

 

ఈ విషయాన్ని రాజస్థాన్‌ లోని అజ్మీర్ జిల్లా కలెక్టర్ గుర్తించారు. తమ జిల్లాలో ఆహార పదార్థాలు పంచుతున్నప్పుడు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  లేదంటే సోషల్ డిస్టెన్సింగ్‌ నిబంధన ఉల్లంఘించినట్టుగా గుర్తించి ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు... ఇప్పటి వరకూ ఇలా 463 కేసులు నమోదయ్యాయి అని పోలీస్ శాఖ వెల్లడిస్తున్నాయి.. అలా చేయడం వల్ల చాలా మంది పేద ప్రజలు సాయాన్ని అందు కోవడాని కి ముందుకు రావడం లేదని అంటున్నారు.. అలా చేయడం వల్ల కరోనా చావుల కన్నా ఆకలి దప్పులు ఎక్కువై చనిపోయే వారి చావుల ఎక్కువ అవుతాయ ని ప్రభుత్వం అంచనా వేస్తుంది.. అందుకే సాయం చేస్తూ సెల్ఫ్ తీసుకుంటే వారి పని గోవిందా.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: