విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. విశాఖ కలెక్టర్, కమిషనర్లతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని రకాల వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో తగిన వైద్యసహాయం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్లు సిద్ధం చేస్తున్నారు.

 

 

ఇక అధికారులు ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ పరిధిలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: