ఆడదంటే ఆది పరాశక్తి.. భూమిలో సగం అని అంటారు. అలాంటిది ఆడపిల్ల పుడితే మాత్రం కొంత మంది సంతోషించినా.. మొదటి కాన్పు మగపిల్లవాడు పుడితే బాగుండు అని పెదవి విరేచేవారు ఎంతో మంది ఉన్నారు.  అలాంటిది ఓ తల్లికి వరుసగా ఆడపిల్లలు పుట్టారు.. ఐదో సారి ఆడిపిల్ల పుట్టడంతో ఆ తల్లి ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లాలో డబ్బు కోసం శిశువును విక్రయించిన దారుణమైన ఘటన వెలుగు చూసింది. మెదక్ వ‌రుస‌గా మూడ‌వ కాన్పులోనూ ఆడ‌పిల్లే పుట్ట‌డంతో… ఆ బిడ్డను పోషించలేక ఓ గిరిజన మహిళ రూ.5000 కు అమ్మ‌కానికి పెట్టింది. ఓ ఆశ కార్య‌క‌ర్త మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో మ‌రో మ‌హిళ ఆ శిశువును తీసుకునేందుకు సిద్ధ‌మైంది.

 

ఆసుపత్రిలో డెలివరీ చేసిన డాక్టర్ కు ఈ విషయం తెలియ‌డంతో శిశువు విక్రయం ఆలస్యంగా బ‌య‌ట‌ప‌డింది. కాగా,  పసికందును కన్న తల్లిదండ్రులకు ఆర్థికపర సమస్యలు ఉన్నాయని, అందుకే శిశువును అమ్మారని అంటున్నారు. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం చిటుకుల్ తండాలో ఈ ఘటన జరిగింది.   గ‌త ఆదివారం సంగీతాను మూడో కాన్పు కోసం ఆమె కుటుంబ‌స‌భ్యులు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.మూడో కాన్పు లో కూడా ఆడపిల్ల జన్మించడం తో పిల్లల ఆర్ధిక భారం భరించలేక పుట్టిన ఆడపిల్లను బుధవారం నాడు అమ్మకానికి పెట్టింది సంగీతా.  

 

అయితే  తమ కొడుక్కి పుట్టిన మూడో ఆడపిల్లను అమ్మేసి, తర్వాత రెండో పెళ్లి కూడా చేయాలని కుటుంబపెద్దలు నిర్ణయించినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తతంగానికి నాగ మణి అనే ఆశ కార్యకర్త మధ్యవర్తిత్వం వహించింది. రాధ అనే మహిళకు 5000 వేల రూపాయలకు శిశువును అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ విష‌యం డెలివ‌రీ చేసిన డాక్ట‌ర్ కు తెలియ‌డంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: