ఈ మధ్యకాలంలో ఆడపిల్లలను  మోసం చేయడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రబుద్ధులు. మాయమాటలు చెప్పి నమ్మించి చివరకి మోసం  చేస్తున్నారు. ఇలా రోజురోజుకు మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువ పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి తో మాట్లాడింది యువతి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇక చివరికి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ యువతిని వంచించిన  ఆ వ్యక్తి నట్టేట  ముంచాడు . ఇక తాజాగా ఈ విషయాన్ని పోలీసులు చెంత  మొరపెట్టుకున్నా యువతి తనను మోసం చేసిన యువకుడు గురించి చెప్పి వాపోయింది. 

 

 

 వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు కళాశాలలో  ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమె ఫోన్ కు అనంతపురం సోమందేవిపల్లి కొత్తపల్లికి  చెందిన ఉదయభాస్కర్ నుంచి ఒకసారి రాంగ్ కాల్ వచ్చిందని... అదే సమయంలో మాయమాటలు చెప్పి తనతో మాటలు కలిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని... పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ యువతి చెప్పుకొచ్చింది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు ఉదయభాస్కర్... తనను నమ్మించి వంచించాడు అంటూ వాపోయింది. తనను పెళ్లి చేసుకోవాలని  ఉదయ భాస్కర్ ను గత రెండేళ్ల నుంచి నిలదీస్తున్నప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి దాటవేస్తున్నాడని .. తప్పించుకు తిరుగుతున్నాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది . 

 

 

 దీంతో ఉదయ్ భాస్కర్ తీరుపై అనుమానం వచ్చి  ఇంటికి వచ్చి  ఉదయ భాస్కర్ ను నిలదీసినట్లు తెలిపింది.  తాను  ఇంటికి వచ్చిన సమయంతో ఉదయభాస్కర్ తో పాటు అతని తండ్రి సోదరుడు మల్లికార్జున కూడా అక్కడ ఉన్నారని వారు అందరూ కులం పేరుతో దూషిస్తు  తనను ఎంతగానో బెదిరించారు అంటూ పోలీసులు చెంత తన గోడు వెలిబుచ్చింది  బాధితురాలు. అయితే ఉదయభాస్కర్ తనతోనే కాకుండా మరికొంత మంది యువతులతో కూడా ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడుపుతూ మహిళలను మానసికంగా శారీరకంగా వంచిస్తూ  మోసం చేస్తున్నాడు అంటూ సదరు బాధితులు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై  వెంకట రమణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: