ఇప్పుడు అందరి చర్చ దాదాపు మూడు అంఆల గురించే నడుస్తోంది. ఒకటి కరోనా వ్యాప్తి, రెండోది లాక్ డౌన్, మూడోది మందు అమ్మకం. ఈ మూడింటి విషయాల్లో మందు హాట్ టాపిక్. మందు విషయంలో దేశంలో ఎక్కువ తాగుబోతులు ఎక్కడ ఉన్నారు అనే ఆసక్తికరమైన లెక్కకు తాజాగా క్లారిటీ ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపిన సర్వే ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్య మొత్తం మద్యంలో 45 శాతం మద్యాన్ని ఓ ఐదు రాష్ట్రాల ప్రజలే తాగేస్తున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
దేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో 13 శాతం దక్షిణాది రాష్ట్రాల ప్రజలే తాగుతున్నారని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు మద్యం గరిష్టంగా వినియోగిస్తున్నారని పేర్కొంది. అత్యధికంగా మద్యం వినియోగించే రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంతో పోటి పడుతూ కర్ణాటక రాష్ట్రం 12శాతం వినియోగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 7 శాతం, తెలంగాణ రాష్ట్రం 6శాతం, కేరళ రాష్ట్రం 5 శాతం వినియోగిస్తున్నాయి. ఇక తర్వాతి విషయానికి వస్తే, ఐదు దక్షణాది రాష్ట్రాలతో కలిపి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొత్తం 12 రాష్ట్రాల్లో 75శాతం మద్యం వినియోగంలో ఉంది.
దేశంలో అత్యధిక విద్యావంతులు ఉన్న కేరళ మందు విషయంలోనూ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఉన్న కేరళ రాష్ట్రం తమ ఆదాయ వనరుల్లో మద్యం అమ్మకాల ద్వారా 15 శాతం సంపాదించుకొని దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేరళతో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆదాయంలో 15 శాతం వాటా మద్యం అమ్మకాల ద్వార పొందుతోంది. అయితే, కేరళలో తక్కువ ప్రజలు ఉన్నప్పటికీ ఎక్కువ ఆదాయం రావడం వెనుక కారణం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ప్రభుత్వం మద్యంపై అత్యధిక పన్ను వసూలు చేయడం. జాతీయ జనాభాలో 4 శాతమే ఉన్న ఢిల్లీ రాష్ట్రం మద్యం ఆదాయం విషయంలో దేశంలో మూడో స్థానంలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 11శాతం, తెలంగాణ 10శాతం కలిగి ఉన్నాయి.