కరోనా నేపథ్యం లో లాక్ డౌన్ కొన సాగుతున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు అన్నీ సంస్థలు బంద్ కావడం తో వడ్డీ వ్యాపారులు జూలు విదిల్చారు.. ఈ ఘటన విజయవాడలో ఆలస్యం గా వెలుగు చూసింది..లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యం లో వడ్డీ వ్యాపారులు రెచ్చి పోయారు.. తన వద్ద తీసుకున్న అప్పు వెంటనే తీర్చాలని.. లేకుంటే తన కోరిక తీర్చాలంటూ మహిళ ను లైంగిక వేధింపుల కు గురిచేశాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ఆమె కూతురిని హాస్టల్‌ లో వదిలేసి తనతో వచ్చేయాల ని ఆఫర్ కూడా ఇచ్చాడట. ప్రతిఘటించినందుకు మహిళతో సహా ఆమె తమ్ముడిని చితకబాదాడు. 

 

 

 

 

 

కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహిళ వడ్డీ వ్యాపారి వద్ద కొంతమొత్తం అప్పుగా తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా తిరిగి చెల్లించలేకపోవడంతో కాల్‌మనీ వ్యాపారి బుసలు కొట్టడం ప్రారంభించాడు. తన అప్పు వెంటనే చెల్లించాలని.. లేకుంటే తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. కూతురిని హాస్టల్‌లో ఉంచి తనతో వచ్చేయాలని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధితురాలు వెల్లడించింది.. 

 

 

 

 

అంతేకాక రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకొని ఇంటి వద్దకు వచ్చి గట్టిగా తలుపులు బద్దలు కొట్టినట్లు ఆమె పేర్కొన్నారు..ప్రతిఘటించడంతో తనను, తన కూతురిని, సోదరుడిని చితకబాదాడని ఆమె చెబుతోంది. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని.. పోలీసులు కనీసం పట్టించుకోకపోగా అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయింది.అర్థబలం దండిగా ఉన్న వడ్డీ వ్యాపారిని పోలీసులు కనీసం పిలిపించి విచారించలేదని.. పైగా సార్ అంటూ సంభోదిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కూతురిని వెంటబెట్టుకొని తిరుగుతున్నాను అతని నుంచి కాపాడాలని తన గోడును వెళ్లబోసుకుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: