రోజు రోజుకి దేశంలో కొత్తకొత్త నేరాలకు పాల్పడుతున్నారు ప్రజలు. వావివరుస మర్చిపోయి అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు ప్రజలు.. ఇక అసలు విషయానికొస్తే... ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి పెద్ద హైడ్రామాకు ప్లాన్ చేసింది. ఆవిడ తన భర్త కరోనాతో మరణించాడు అంటూ ఒక కట్టుకథ చెప్పి ఆయనకు అంత్యక్రియలు ఏర్పాటు చేసింది. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అంతే పోలీసులు వెంటనే రంగంలోకి దిగిపోయారు. అనుమానం వచ్చిన తర్వాత డెడ్ బాడీని పోస్టుమార్టం వెనక్కి పంపడంతో అసలు ఏం జరిగిందో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీ నగరంలోని అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన అనిత (30), శరత్ దాస్ (46) భార్య భర్తలు ఇద్దరు నివాసం ఉంటున్నారు. అయితే ఒకరోజు ఉదయాన్నే సడన్ గా తన భర్త మరణించాడని అదికూడా కరోనా కారణంగా ప్రాణాలు విడిచాడు అని భార్య ఇరుగుపొరుగు వారికి తెలిపింది. అయితే వెంటనే దాస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండడంతో చుట్టూ ఉన్న ప్రజలకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన పోలీసులు అతను ఎలా చనిపోయాడో పూర్తి వివరాలపై ఆరా తీశారు. దీనితో ఆవిడ ఇచ్చిన సమాధానాలు అనుమానం రేకెత్తించడంతో కరోనా వచ్చిన వ్యక్తికి చనిపోతే కరోనా రిపోర్ట్స్ చూపించమని అడగడంతో ఆవిడ తెల్లమొహం వేసింది. దీంతో ఆమె మరణంపై అనుమానం వచ్చిన వెంటనే అంత్యక్రియలు ఆపేసి పోస్టుమార్టం కొరకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో అసలు కథ వెల్లడైంది.


అందరూ అనుకున్నట్టుగానే అనారోగ్యంతో చనిపోలేదని ఎవరో ఊపిరాడకుండా చేసి చంపారని అందులో తేలింది. దీంతో పోలీసులు అతని భార్యని వారి స్థాయిలో విచారించగా అసలు నిజాలు తెలిపింది. తనకు సంజయ్ అనే మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అది తెలిసినప్పటి నుంచి తన భర్త వేధింపులకు గురిచేయడంతో ఇలా చేశానని ఆవిడ పోలీసుల ముందు ఒప్పుకుంది. నేను, నా ప్రియుడు సంజయ్ తో కలిసి ముఖానికి దిండు అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి భర్త దాస్ ను చంపేసినట్లు ఆవిడ పోలీసుల ముందు అంగీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: