ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమిత మయ్యారు. కాకపోతే ఇది కొందరి జీవితంలో పెద్ద శాపంగా మారుతుంది అంటే నమ్మండి. ఈ సమయంలో ఇంట్లోనే ఉంటున్నా భర్త తన చేతివేళ్లు నరికేందుకు ప్రయత్నం చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంఘటన కలకత్తాలో చోటు చేసుకోవడం జరిగింది.. ఒక పెద్ద కత్తితో పేర్లు నరికేందుకు ప్రయత్నం చేశాడని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అధికారులు భర్తను అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా ఆమెకు ఆడపడుచు రూపంలో అనుకోని షాక్ ఎదురయింది అనే చెప్పాలి. వదిన పై ఫిర్యాదు చేసిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 


పూర్తి వివరాల్లోకి వెళితే... కలకత్తాలోని వ్యాలీ గన్స్ ఒక వీధికి చెందిన వివాహితపై భర్త హత్య ప్రయత్నం చేశాడు అని పోలీసులు ఆశ్రయించడం జరిగింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని స్వస్తిక్ సేవాసదన్ ఆస్పత్రికి తరలించి.. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసు అధికారులు నమోదు చేసుకోవడం జరిగింది. 

 


ఇలా ఉండగా అసలు బాధితురాలిని తానంటూ భర్త చెల్లెలు.. వివాహిత స్వయానా ఆడపడుచు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా వదిన నా పై కత్తితో దాడి చేసిందని, ఆమె పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో పోలీస్ అధికారులు కత్తితో దాడి చేయడంతో నాకు గాయాలు అని తెలపడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఫిర్యాదు పోలీసు అధికారులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇక నిజానికి వదిన ఆడపడుచులు ఇద్దరు ఎవరు చెప్పింది కరెక్టో కాదో అర్థం అవ్వక పోలీస్ అధికారులు సతమతమవుతున్నారు. ఇక విచారణలో అసలు నిజం బయట పడే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: