ప్రేమ ఒక మధుర జ్ఞాపకం అంటూ ఉంటారు కానీ నేటి కాలంలో ప్రేమ ప్రాణాలు తీసే ఒక చేదు అనుభవం అంటున్నారు. ప్రేమ ఎంతో మంది యువతీ యువకుల ప్రాణాలను తీసుకుంటున్నది . తాజాగా ప్రేమ పేరుతో మరో ప్రేమ జంట బలైపోయింది. ఈ ప్రేమజంట ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీ గా మారిపోయింది. అయితే ఆ ఇద్దరు  ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటయ్యారు అనుకున్నారు. ఇక ఎన్నో కష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు అనుకుంటున్న తరుణంలో ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. పురుగుల మందు తాగి ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నిండిపోయింది. ఇక ఈ ఊహించని ఘటన తో తల్లిదండ్రులు సైతం షాక్కు గురయ్యారు. 

 

 

 ఈ విషాద ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఖంపూర్  గ్రామానికి చెందిన సీతాబాయి ఉట్నూర్ మండలంకి చెందిన  గణేష్ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియగా మొదట మందలించినప్పటికీ ఆ తర్వాత అర్థం చేసుకొని వీరిద్దరికీ పెళ్లి చేయాలని భావించారు. దీంతో ఆ ప్రేమ జంట ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇక వీరిద్దరికీ నిశ్చితార్థం పెళ్లి తేదీలు ఫిక్స్ చేయడం కోసం ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడుతున్నారు.

 

 

 కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇదంతా మిస్టరీ గా మారిపోయింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకుని పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో ఇలా ఒక్కసారిగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిపోయింది. తాజాగా పొలంలో కలుసుకున్న ఇద్దరు ప్రేమికులు సోదరుడికి  ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ తెలిపి  పురుగుల మందు తాగి బలవన్మరణానికి  పాల్పడ్డారు. ఇక సోదరుడు హుటాహుటీన అక్కడికి వెళ్ళే సరికి అప్పటికే ప్రాణాలు విడిచారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణం ఏమిటి అన్నది మాత్రం ప్రస్తుతం మిస్టరీ గా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: