వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, జ‌బ‌ర్ద‌స్త్ రోజా గురించి అంద‌రికీ తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఎలాగైతే.. గిలిగిం త ‌లు పెట్టే వ్యాఖ్య‌ల‌తో క‌డుపుబ్బ న‌వ్వించి స‌టైర్ల‌తో ముంచెత్తుతుందో.. రాజ‌కీయంగా.. రోజా త‌న‌దైన శైలిలో ప్ర‌తిప‌క్షాలపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం తెలిసిందే. గ‌తంలో కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై తీవ్ర‌స్థాయిలో అసెంబ్లీలో విమ‌ర్శ‌లు గుప్పించి ఏకంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్‌కు గుర‌య్యారు. ఇలా త‌న‌దైన శైలిలో మీడియాలో నిలిచే.. రోజా.. వ‌రుస‌గా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కుతున్నారు.

 

అయితే, ఇటీవ‌ల లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఓ బోర్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన స‌మ‌యంలో స్తానికుల‌తో పూలు చ‌ల్లించుకుని న‌డిచార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇక‌, రాజ‌కీయంగాను ఆమె దూకుడు చూపిం చ‌లేక పోయారు. అయితే, తాజాగా మాత్రం రోజా చేసిన వ్యాఖ్య‌లు.. సీఎం జ‌గ‌న్‌ను సైతం ఆక‌ట్టుకున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విశాఖలో ఎల్‌జీ పాలిమ‌ర్స్‌ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డాయి. ముఖ్యంగా టీడీపీ.. జ‌గ‌న్‌ను టార్గెట్ చేసింది. జ‌గ‌న్ ఈ విష‌యంలో స‌రిగా స్పందించ ‌లేదని పేర్కొంది. సంస్థ‌పై కేసులు పెట్టలేద‌ని పేర్కొంది. దీంతో రాజ‌కీయంగా ఈ విష‌యం దుమారం రేపింది.

 

నిజానికి విశాఖ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే సీఎం జ‌గ‌న్‌.. అక్క‌డ‌కు చేరుకున్నారు. కేజీహెచ్‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్క‌టికీ రూ.కోటి ప‌రిహారం ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ.. ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టుగా టీడీపీ నేత‌లు మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విష‌యంలో ఎంట్రీ ఇచ్చిన రోజా.. టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.టీడీపీ నేతలు గ్యాస్ దుర్ఘటనపై కూడా చీప్‌గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌ ఈ ఘటనపై హైపవర్‌ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు.

 

టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని రోజా నిప్పులు చెరిగారు. నిజానికి విప‌త్తుతో మృతి చెందిన కుటుంబాల‌కు ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇచ్చిన ప‌రిస్థితి లేద‌ని, ఇంత ఉదార హృద‌యంతో ప్ర‌జ‌ల‌కు పాల‌న అందిస్తున్న జ‌గ‌న్‌ను చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా మురిసిపోతున్నాయ‌ని రోజా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ నుంచి కూడా రోజాకు కాంప్లిమెంట్లు వ‌చ్చాయ‌ని అంటున్నారు. మొత్తానికి రోజా..లో రెండో కోణం కూడా బాగుంద‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: