ఒకప్పుడు మగువలు ఇంటి బయట ముగ్గు వేస్తూ కనబడే వాళ్ళు. లేకపోతే గుడికి వెళుతూ చాలా చక్కగా కనబడే వాళ్ళు. కాల ప్రభావం ఏమో తెలియదు గానీ మగువలు ఇప్పుడు మందు షాపులు ముందు క్యూ లైన్ లో కనబడుతున్నారు. వాళ్ళలో ఎంతమంది పెళ్లిళ్లు చేసుకుని ఇతర ఇళ్లల్లో కాపురాలు ఎలా చేస్తారు అన్నది చాలామందికి అర్థం కాని పరిస్థితి కి కారణమైంది. మగవాళ్ళ తో తాము ఏమాత్రం తక్కువ కాదని అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఇప్పుడు రాణిస్తున్నారు. సాఫ్టువేర్ రంగాలలో మరి కొన్ని రంగాలలో అన్ని పనులు చేస్తూ కష్టపడుతున్నారు. మగవాళ్లు బాగా కష్టపడి ఎలా మందుకి బానిస అవుతారో ఆడవాళ్లు కూడా అదే రీతిలో తాగేస్తున్నారు.

 

ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీస్ అయినా బెంగళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాలలో మద్యం షాపుల ముందు మద్యం కోసం ఇటీవల భారీ స్థాయిలో 'క్యూ' లో నిలబడటం వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భయంకరంగా కార్ లలో మందు బాటిల్ కొనుక్కొని వెళ్తున్నారు. చాలామంది ఈ వీడియోలు చూసి అప్పట్లో ఇంటిపట్టున మగువలు ఉండేవాళ్ళు ఇప్పుడు మందు మగువలు ఎక్కువైపోయారు అని అంటున్నారు. తాజాగా ఓ వైన్ షాపు నుంచి 90ఎంల్ తీసుకొని గడగడతాగేసిన ఓ యువతి వీడియో వైరల్ అయ్యింది.

 

ఇక ముసాలావిడ మద్యం రోజూ పెగ్గు తాగుతానని.. లాక్ డౌన్ లో దొరక్క కల్లు తాగితే కడుపు ఉబ్బుతోందని.. అందుకే ఫుల్ బాటిల్ మద్యం కొన్నానని వీడియోలో చెప్పింది. అంతేకాకుండా తనకి నోటిలో మందు చుక్కా పడకపోతే నిద్రపట్టని పరిస్థితి అని జీవితంలో మద్యం మానని ఆ మహిళ చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ సడలింపు లో మద్యం దుకాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశంలో ఇంతమంది ఆడవాళ్లు మద్యం దుకాణాల ముందు భారీగా క్యూలైన్లలో నిలబడటంతో, లేడీస్ కూడా దేశంలో భారీ స్థాయిలో మద్యం తాగుతున్నారని వీడియోలు బట్టి అర్థమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: