ప్రస్తుత జనరేషన్ లో పెద్దలు ఏదైనా కారణంతో అయినా ఏదో చిన్న విషయానికి మందలించారనో చిన్న చిన్న విషయాలకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు ఈతరం మనుషులు. ఇక అసలు విషయానికి వస్తే... అత్త మందలించిదన్న కోపంతో ఒక వివాహ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం కంచర్ల గ్రామానికి చెందిన శివాని కు ప్రకాశం జిల్లా పోలవరం గ్రామానికి చెందిన హనుమంతుతో 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరు వారి జీవనం కొరకు హైదరాబాద్ కు మకాం మార్చటం జరిగింది. అయితే ఆత్మహత్య చేసుకున్న శివాని భర్త హనుమంతు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అయితే శివాని కూడా ఆయన దగ్గర పనిచేసే వారికి రోజు భోజనం వండి పెట్టేది.

 


ఇదిలా కొనసాగుతుండగా ఒక నెల రోజుల క్రితం హనుమంతు తల్లి కూడా వీరి వద్దకు వచ్చి జీవనం కొనసాగిస్తుంది. అయితే శివాని దంపతులు పనివారితో సహా వారు చేసిన దాంట్లోనే భోజనం చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఇకపోతే కొత్తగా వచ్చిన అత్త తనకు ఆ భోజనం వద్దని ఆమెకు సపరేట్ గా ఉండాలని ఆమె చెప్పింది. ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ విషయం చిన్నగా మొదలై తిరిగి తిరిగి పెద్దగా మారింది. అయితే రెండు రోజుల క్రితం శివాని భర్త హనుమంతు పని కోసం బయటికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చి చూడగా గదిలో శివాని ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. అయితే వెంటనే హనుమంతు శివాని ను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే శివాని మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఏది ఏమైనా ఇలాంటి చిన్నచిన్న గొడవలకు ప్రాణం తీసుకోవడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: