మదర్స్ డే రోజే దారుణమైన సంఘటనని వెలుగు చుడాల్సి వచ్చింది..నవమాసాలు మోసి కన్న తల్లిని కనీసం కనికరం లేకుండా ఓ సుపుత్రుడు ఇంట్లో నుంచే దయ దాక్షణాలు లేకుండా గెంటేసిన ఘటన వేగులు చూసింది.  ఉత్తి పుణ్యానికి గెంటేసి ఇంటికి తాళం వేశాడు.. తోడుగా ఉన్నాడనుకున్న కన్న కొడుకునే ఇలా చేయడం తో ఆ తల్లి కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది..

 

 

 

వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ తల్లిని నడిరోడ్డుపై ఒంటరిగా వదిలేశాడు. మాతృదినోత్సవం రోజునే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడు మండలం సారపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది.


 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ (70) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఎన్నో కష్టాలకోర్చి పిల్లలను పెంచి పెద్ద చేసి అందరికీ వివాహాలు జరిపించారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి వేరు కాపురం పెట్టాడు. కోటమ్మ భర్త రంగారెడ్డి మూడు నెలల కిందట మరణించారు. దీంతో ఆమె తన ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. తోడై ఉండాల్సిన కొడుకు తోడల్లై పీక్కు తిన్నాడు..






నిన్న ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. తన కొడుకు 36 వేలు తీసుకున్నాడని దాన్ని తనకు ఇప్పించాలని పిర్యాదు లో పేర్కొంది.. అంతేకాకుండా తన ఇంటిని తనకు ఇవ్వాలని కోరింది.  తన కొడుకు తన ను ఆస్తి కోసం చంపేస్తాడు అని ప్రాణ హాని ఉందని ఆమె గోడును పోలీసుల ముందు వెళ్ళబోసింది దీంతో ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: