రోజురోజుకు మహిళల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఎందుకంటే వారికి ఎదురవుతున్న  లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులు ఎదుర్కొనే తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఓవైపు మహిళలందరూ తమ సాధికారతను చాటుతూ పురుషులతో తాము ఎక్కడ తక్కువ కాదు అని చూపిస్తోంటే...  కొంతమంది మహిళలు మాత్రం కామాంధుల కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అందరిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు  రోజురోజుకు పెరిగిపోతోన్నాయి . 

 

 

 ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా ఇక్కడో  మహిళకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి. యోగా నేర్చుకోవడానికి వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన యోగ గురువులు  కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్లోని రిషికేశ్ లో చోటుచేసుకుంది. తమవద్దకు యోగా నేర్చుకోవడానికి వచ్చే జపాన్ మహిళపై  ఆ ముగ్గురు యోగా గురువులు బాధ్యతగా వ్యవహరించాల్సి చనిపోయి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 

 

 

 జపాన్ చెందిన మహిళా రిషికేశ్ లో ఉంటూ అక్కడి ఆమ్ బాగ్  ఏరియాలో ఒక యోగ స్కూల్లో యోగా నేర్చుకుంటుంది. ఆ యోగ స్కూల్లో   హరికృష్ణ చంద్రకాంత్ సోమరాజు  అనే ముగ్గురు యోగా గురువులు మహిళ పై కన్నేశారూ . యోగా పేరుతో తరచూ ఆమెను లైంగికంగా వేధించేవారూ . తమతో శృంగారం చేయాలంటూ ముగ్గురు యోగా గురువులు ఆ మహిళపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చేవారు. రోజురోజుకు వారి ఆకృత్యాలు కాస్త ఎక్కువైపోతుండటంతో  విసిగి పోయిన సదరు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ముని కి  రేతి  పోలీస్ స్టేషన్ లో ముగ్గురు యోగా గురువులు పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి  ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: