లాక్ డౌన్ సందర్భంగా అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. దీనితో ఎవరైనా కలవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా మాట్లాడాలని పార్క్ కు వెళ్లిన ఆ ప్రేమ జంటకు దారుణమైన సంఘటన ఎదురైంది. ఆ అమ్మాయిపై కన్నేసిన కామాంధులు ప్రియుడిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నగరంలో చోటు చేసుకుంది. 

IHG


వీరిరువురు ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ ఉన్నారు. అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా వారు తరచూ సినిమాలు, షికార్లు అలాగే బయటికి పార్కులకు వెళ్లేవారు. అయితే గత రెండు రోజుల క్రితం వారు ఏకాంతంగా గడిపేందుకు ఒక పార్కుకు వెళ్లారు. చెట్ల పొదల్లోకి వెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ చీకటి పడిన విషయాన్ని గమనించలేదు అసలు వారు. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న నలుగురు వారిద్దరిని గమనించారు. వారందరూ కలిసి ఆ ప్రేమ జంట బలవంతంగా ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ జంటలోని అబ్బాయిని ఒక చెట్టుకు కట్టేసి అతని కళ్ళెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సంఘటన అనంతరం అక్కడి నుంచి ఆ నలుగురు పరారయ్యారు.

 

కొద్దిసేపటి తర్వాత తేరుకున్న యువతి ప్రియుడి కట్లు విప్పిగా ఇద్దరు కలిసి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయాన్ని తెలిపి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. అందులో నిందితుల్ని గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. పరారైన మరో వ్యక్తిని గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: