మహిళ ల రక్షణ కోసం ఎన్నో చట్టా లను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధుల రాక్ష సత్వాన్ని తీర్చుకుంటున్నారు.. పసికందుల నుంచి పండు ముస లాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు..పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎందరో చనిపోయారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళల్లో ఎటువంటి మార్పు రాలేదు..




వివరాల్లోకి వెళితే..తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది..ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు(23) అనేక సార్లు లైంగిక దాడి కి పాల్పడ్డాడు. ఈ ఘటన సీతానగరం మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఓ యువకుడు మూడు రోజుల కిందట సీతా నగరం లోని ఈ గ్రామం లో ఉండే తన పెద్దమ్మ ఇంటి కి వచ్చాడు. వారి ఇంటి పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది.




 

 

ఆ బాలిక పై కన్నేసిన యువకుడు తల్లి దండ్రులు లేని సమయంలో ఇంట్లోకి దూరి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లి దండ్రుల తో పాటు స్థానికులు పీఎస్ ఎదుట కాసేపు ఆందోళన చేపట్టారు. కోరుకొండ డీఎస్పీ పీఎస్‌ఎన్‌ రావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు గ్రామానికి చేరి వివరాలు సేకరించారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పోలీసులకు విషయం తెలిసిందని తెలుసుకున్న యువకుడు అక్కడ నుంచి పరారయ్యారు.. స్పెషల్ టీమ్ సాయంతో వేతికిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: