ఈ మధ్య కాలంలో మనిషి ప్రాణం అంటే కొంచమైనా విలువ లేకుండా పోయింది. కుటుంబ కలహాలు అక్రమ సంబంధాలు... ఇతర కారణాలు వెరసి  రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు సాటి మనుషులు. ఏకంగా జాలి దయ  లేకుండా కట్టుకున్న వారిని కడితేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జరిగిందని నిజామాబాద్ లో . నిజాంబాద్ లో జరిగిన దారుణ ఘటన ఏకంగా పోలీసులనే  షాక్ అయ్యేలా చేస్తుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా చంపి ఏకంగా నదీతీరంలో పాతిపెట్టింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం మందర్న గ్రామానికి చెందిన మహిళ రెండు రోజుల క్రితం భర్త ను దారుణంగా హత్య చేసింది . ఇక ఈ విషయం ఎవరికీ అనుమానం రాకుండా ఎవరికీ తెలియకుండా తన భర్త మృతదేహాన్ని మంజీరా నది తీరం వద్దకు తీసుకుని వెళ్లి  అక్కడే విడిచి పెట్టింది.ఇక ఆ రెండు రోజుల పాటు సదరు వ్యక్తి కనిపించకపోవడంతో నీ భర్త కనిపించడం లేదు అంటూ సదరు మహిళను స్థానికులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది దీంతో సదరు మహిళ తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

 

 ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా తన భర్త ను తానే హత్య చేసి మంజీరా నది తీరంలో పూడ్చి పెట్టాను అంటూ నేరం అంగీకరించింది  సదరు మహిళ. దీంతో అటు పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు. ఆ మహిళ ఆధారంతో నదీ తీరానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన భర్తను హత్య చేయడానికి గల కారణం ఏమిటి... కుటుంబ కలహాలా..? అక్రమ సంబంధమా..?  ఇంకేదైనా ఉందా..?  అనే కోణంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: