ఒకప్పుడు టాలీవుడ్ లో సిద్దార్థ, ఇలియానా జంటగా నటించిన ‘భలే దొంగలు’ మూవీలో ఇద్దరు పక్కా ప్లాన్ వేస్తూ ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తూ దొంగతనాలు చేస్తుంటారు.  అయితే ఇది సినిమాల్లో చూస్తుంటే చాలా థ్రిల్లింగా ఉంటుంది.. కానీ రియల్ లైఫ్ లో అయితే పోలీసులకు తలనొప్పిగా ఉంటుంది.  ఈ దొంగ, దొంగది నిజంగా సినీ ఫక్కీల్లో దొంగతనాలు చేస్తుంటారు. గత కొంత కాలంగా వీరిపై గట్టి నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పట్టేసుకున్నారు.   సెంట్రల్ ఢిల్లీలోని పహార్ జంగ్ కు చెందిన అర్జున్ అలియాస్ కరణ్ గతంలో డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. ఈ దొంగపై ఇప్పటికే దాదాపు 31 కేసులు ఉన్నాయి. 

 


ఇదే ప్రాంతానకి చెందిన టాటూ ఆర్టిస్ట్ వైశాలి అలియాస్ సీమా ఒకానొక సమయంలో డ్రగ్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వీరి మద్య స్నేహం ఏర్పడి తరుచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ వస్తుంది  వైశాలి.  అయితే వీరి స్నేహం కాస్త  ప్రేమగా మారి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గత రెండు నెలల నుంచి దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో వీరి దందా పూర్తిగా ఆగిపోయింది. దీంతో డబ్బులకు ఇబ్బంది ఏర్పడింది. డబ్బుల కోసం ఈ జంట దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు.  

 


వారు చేసే దొంగతనాలకు ముందు రెక్కీ నిర్వహిస్తూ.. చోరీలకు పాల్పపడటం మొదలు పెట్టారు. తొలుత రఘుబీర్ నగర్ ప్రాంతంలో ఓ స్కూటీని దొంగలించారు. తరువాత సెల్ ఫోన్ స్నాచింగ్ మొదలు పెట్టారు. అర్జున్ బండి నడిపితే వైశాలి వెనకాల కూర్చొని సెల్ ఫోన్లను లాగేసుకునేది. అయితే తమ సెల్ ఫోన్లు, గొలుసులు మాయమవుతున్నాయని.. చైన్ స్నాచర్ల బాధ తట్టుకోలేక పోతున్నామని  కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో స్నాచింగ్స్ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి రెండు రోజుల క్రితం కిషన్ గంజ్ రైల్వే కాలనీలో ఈ జంటను పోలీసులు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: