కర్నూల్ జిల్లా తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు AV సుబ్బారెడ్డిపై జరగాల్సిన హత్యాయత్నం కేసులో కీలక ములపు జరిగింది. AV సుబ్బారెడ్డి హత్యయత్నం కేసులో ముఖ్య సూత్రధారిగా ఉన్న మాదా శ్రీనివాసులును మంగళవారం నాడు కడప పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. AV సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు గాను చేసిన ఆర్థిక లావాదేవీల్లో శ్రీనివాసులు ముఖ్య పాత్ర పోషించడంలో పోలీసులు అతడిని గుర్తించారు.

 


AV సుబ్బారెడ్డి హత్యకు నిందితులు ఏకంగా రూ. 50 లక్షలు సుపారీగా తీసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే హత్య కేసుకు గాను మార్చి 21వ తేదీన పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా నిందితులు అందించిన సమాచారం మేరకు AV సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 2 మొబైల్స్, ఒక వాహనం, కొద్దిగా నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ఇకపోతే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో AV సుబ్బారెడ్డి దివంగత నేత భూమా నాగిరెడ్డికి స్నేహితుడిగా, అనుచరుడిగా ఆయన ఉండేవారు. ఇక భూమా నాగిరెడ్డి తదనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ, AV నాగిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కాస్త ఎక్కువగానే సాగింది. వీరిద్దరి గొడవలు టీడీపీ అధినేత చంద్రబాబు వరకు కూడా చేరింది. అప్పట్లో రాజీ కుదిరి అంత సర్దుకుంది అనుకుంటుండగా మళ్లీ వారి మధ్య వివాదాలు నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 

ఇక ఇలాంటి నేపథ్యంలోనే AV సుబ్బారెడ్డికి హత్యకు రెక్కీ చేస్తూ మార్చి నెలలో ముగ్గురు వ్యక్తులు దొరికారు. అయితే అప్పుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పడిన ప్రధాన సూత్రదారులను త్వరలోనే పట్టుకుంటామని కడప జిల్లా డీఎస్పీ సూర్యనారాయణ విషయాన్నీ చెప్పుకొచ్చారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: