ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి.. భార్య భర్తలు విడిపోతున్న సంఘటనలు చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ తరహాలోనే కుటుంబ కలహాలతో భార్య, అత్తపై లోకల్ తో దాడి చేసి.. భార్యను హత మార్చాడు దుర్మార్గుడు. ఇక ఈ సంఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా అత్త తీవ్ర గాయాల పాలుతో ICU లో ఉంది. ఈ దారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రము భద్రాది గూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాచారం గ్రామానికి చెందిన చేపల మడుగు మురళికి దుడ్డేపూడి కు చెందిన రాణితో ఐదు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది.

 

అయితే మురళి మద్యం ఇతర వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా మధ్య గొడవలు వచ్చి... 2 సంవత్సరాల క్రితం రాణి తన పుట్టింటికి వెళ్ళింది. ఇలా ఉండగా తాజాగా భార్య కోసం వారి ఇంటికి వెళ్లి తాను ఇంటికి రావాలని బలవంతం చేశాడు. దీనితో చెడు వ్యసనాలు మానే వరకు నేను రాను అని రాణి తెలియజేసింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు పెరిగి... చివరికి మురళి తల్లి రాత్రి వచ్చి ఇదే విషయం పై గొడవకు దిగగా.. రాణి తల్లి వాళ్ళిద్దరినీ సర్దిచెప్పేకి ప్రయత్నం చేసింది.

 

ఇక దీనితో భరించలేని ఆగ్రహానికి గురైన మురళి రోకలి బండతో ఇద్దరి మీద దాడికి  పాల్పడ్డాడు. దీనితో భార్య రాణి అక్కడికక్కడే మృతి చెందింది.. ఇక అత్త తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు.. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన గురించి తెలుసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక తల్లి చనిపోవడం తండ్రి హంతకుడిగా మారడంతో ఆ చిన్నారి అనాధ పిల్లలగా మారింది. తన కోపమే తనకు శత్రువు అంటే ఇదేనేమో ...!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: