కన్న కూతురి పైనే బంధువులతో కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. అది కూడా నడిరోడ్డుపై దుస్తులు చించేసి మరి పైశాచికంగా ప్రవర్తించాడు. ఇక అల్లుడు అని లెక్కచేయకుండా కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... తుంకూరు జిల్లాలోని తిపటురు తాలూకాలోని గోపాలపురం గ్రామంలో భూములకు సంబంధించి ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

 


గోపాలపుర గ్రామానికి చెందిన భైరప్ప కుమార్తె అమృతకు ఆరు సంవత్సరాల క్రితం సునీల్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. ఇక వీరిద్దరూ కూడా బెంగళూరులో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల మార్చ్ ఇద్దరు దంపతులు కలిసి గోపాలపురంలోకి పుట్టింటికి రావడం జరిగింది. ఇక ఇంతలోనే కరోనా లాక్ డౌన్ అమలు కావడంతో దంపతులు అక్కడే ఉండి పోవడం జరిగింది. ఈ తరుణంలోనే తండ్రి తన పొలంలో మట్టిని తొలగించి వేరే వాళ్లకు అమ్మడం కొనసాగించాడు. ఈ విషయంపై అమృత తండ్రిని ప్రశ్న అడగగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది దానితో అమృత న్యాయం కోసం నోవినకెర పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది.

 


ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవకు దిగాడు తండ్రి.  అలాగే తన తమ్ముని బంధువులను అందరినీ.. కూతురు, అల్లుడు పై కత్తులు కర్రలతో దాడి చేయించడం జరిగింది. ఇక వారందరూ కలిసి అమృత దుస్తులు చించేసి మరి అత్యంత దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఈ దారుణమైన ఘటనలో అమృత తన భుజాలకు తీవ్రగాయాలు అయ్యి రక్త స్రావం జరిగింది. ఇక సునీల్ కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.  దీనితో అక్కడ ఉన్న స్థానికులు వారిద్దరిని ఆస్పత్రికి చేర్పించడం జరిగింది. 


ఇక ఈ దారుణమైన ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుల నుంచి ఘటనపై అన్ని వివరాలు అడిగి కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే అమృత పోలీసులతో తన తండ్రి చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అని.. ఆస్తిని అంతా కూడా వారికే సమర్పిస్తాడు అందుకే ప్రశ్నించగా దాడికి పాల్పడ్డాడు అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ విషయంపై పోలీసులు అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: