దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల్లో మూతపడ్డ సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ప్రాంతాలలో సడలింపులు చేసిన తర్వాత అనేక దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మందుబాబులు చెలరేగిపోతున్నారు. మద్యం మత్తులో కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక దరిద్రుడు. ఈ దారుణమైన ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన లసుమ్బి కి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 

 


ఇక గతంలోనే భర్త చనిపోవడంతో ఒంటరిగానే జీవనం కొనసాగిస్తుంది. తనకు ఉన్న ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వచ్చే డబ్బులతో జీవనం కొనసాగిస్తుంది. ఇక ఆ డబ్బు పై పెద్ద కొడుకుని అయినా నాందేవ్ వాటిపై కన్ను వేసాడు. ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న తల్లిపై కౌలు డబ్బులు ఇవ్వాలి అంటూ గొడవ పడేవాడు. ఇటీవల తన తల్లి ఈ కవులు డబ్బులు వచ్చిన సంగతి తెలుసుకొని తల్లితో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో కవులు డబ్బులు నాకు ఇవ్వాలి అంటూ ఘర్షణ దిగాడు.

 

 

దీనితో తల్లి ఎట్టిపరిస్థితిలో నీకు ఇవ్వను అంటూ ఘర్షణ పడ్డారు ఇంకా చివరికి నాందేవ్ ఆగ్రహంతో దారుణానికి ఒడిగట్టాడు. తల్లి ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు. కానీ మంటల్లో కాలిపోయి తీవ్రగాయాల పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఆమె పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కొడుకు, కోడలు పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: