ఓకే ఇంట్లోనే భార్య ప్రియురాలితో కాపురం కొనసాగించాడు ఒక వ్యక్తి. ఆ ముగ్గురూ కలిసి కొన్ని రోజులుగా జీవనం కొనసాగించారు. ఏమయిందో ఏమో కానీ సడన్ గా ప్రియురాలి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను వారి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్ని రెండు రోజులకే భార్య శవం బావిలో కనబడింది. ఇక ఆరోజు నుంచి భర్త కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఈ దారుణమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో చోటుచేసుకుంది.

 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ కు చెందిన మహమ్మద్ రివని, షకీలా బేబీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక బతుకు తెరువు కోసం పంజాబ్ వలస వచ్చి లుధియానా ప్రాంతంలో  అలంగిర్ గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. నిజానికి షకీలాకి అది రెండో వివహం. రివాని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని మహిళలు ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇక భార్య, ప్రియురాలు ఇద్దరూ కలిసి కొన్ని రోజులుగా ఇంట్లోనే జీవనం కొనసాగించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ఆమెను వారి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. 

 


ఇక అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీనితో ఆగ్రహంతో భార్య షకీలాని చంపేసి దందరాన్  గ్రామంలో బావిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటీవల బావిలో నుంచి మహిళ శవం కనపడటంతో స్థానికులు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి పోలీస్ అధికారులు వచ్చి మహిళా మృతదేహాన్ని బయటకు తీయించారు. ఇక దేహం ఆధారంగా షకీలా బీ గా గుర్తించారు పోలీసు అధికారులు. అలాగే భర్త కూడా జార్ఖండ్ కు పారిపోయినట్లు సమాచారం. ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో విషమిచ్చి చంపేసినట్లు పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇక పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్స్ ఆధారంగా ఘటనపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇక నిందితుడు మహమ్మద్ రఫీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు పోలీస్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: