జగన్ ప్రభుత్వం మీద విమర్సలు చేయడంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఏ మాత్రం అలిసిపోతున్నట్లు కనిపించడం లేదు. మిగిలిన టీడీపీ నేతలు కాస్త గ్యాప్ ఇచ్చిన ఉమా మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై ఏదొక విమర్శ చేయడం చేస్తున్నారు.

 

ఓటమి వల్ల ఎక్కువ ఖాళీగా ఉంటున్నారు అనుకుంటా..అందుకే జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. అసలు విమర్సలు చేయడంలో చిన్న విషయం, పెద్ద విషయం అంటూ ఏమి లేకుండా, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కరోనాపై డైలీ విమర్సలు చేస్తూనే వచ్చారు. ఇక మద్యం షాపులు, విశాఖ గ్యాస్ లీకేజ్, కరెంట్ చార్జీల పెంపు ఇలా ప్రతి అంశంపై రాజకీయం చేస్తున్నారు.

 

ఇక ఇలా విమర్సలు చేస్తున్న దేవినేని ఉమా...తాజాగా క్వారంటైన్ వసతుల్లో, భోజన సదుపాయాల్లో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బ్లీచింగ్ ఫౌడరులో సున్నం కలపడం ఏంటని నిలదీశారు. అయితే బ్లీచింగ్ పౌడరులో సున్నం కలిపినట్లు ఎక్కడ కనిపెట్టారో ఉమా చెప్పాలని కృష్ణా జిల్లా వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే క్వారంటైన్ వసతుల్లో వైసీపీ నేతలు చేతి వాటం చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఉమా ఖాళీగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఏదొకవిధంగా మీడియాలో కనపడాలి, చంద్రబాబు దగ్గర హైలైట్ అవ్వాలని ఉద్దేశంతో ఇలాంటి హడావిడి చేస్తున్నారని అంటున్నారు. అయిన ఉమాని సొంత పార్టీ నేతలే పట్టించుకోరని, ఆయన ఆరోపణల్లో ఎలాంటి అర్ధం ఉండదని చెబుతున్నారు. అయితే గతంలో ఉమా ఎన్ని ప్రాజెక్టుల్లో చేతివాటం ప్రదర్శించారో తెలుసని, తన అనుకూల మనుషులకు కాంట్రాక్టులు ఇచ్చి, ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారో కూడా బాగా తెలుసని కౌంటర్ ఇస్తున్నారు. అలా చేయడంలో వల్లే ఉమా చిత్తుగా ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: