ప్రస్తుత రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి హెచ్చుమీరుతున్నాయి. మానసిక  వికలాంగురాలు ఐన మహిళపై ఇద్దరు దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. దీని ఫలితంగా ఆమెకు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన జీవితంలో ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఆమెకు తండా వాసుల రూపంలో ఇబ్బంది ఎదురుపడింది. ఈ దారుణమైన సంఘటన అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నడిరోడ్డు పై పసిబిడ్డను ఉన్న ఆమెను చూసి కొందరు ఆరా తీయడంతో ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా బయటకు వచ్చాయి.

 


అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని ఒక తండాకు చెందిన యువతి పుట్టినప్పటి నుంచి కూడా మానసిక వికలాంగురాలు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులు కూడా ఆమెను దగ్గరకు తీసుకోలేదు. ఆమె ఒక్కటే జీవనం. ఈ రోజు ఉదయం గుంతకల్ పట్టణంలోకి వెళ్లి యాచించు కొని వచ్చి సాయంత్రానికి మళ్లీ తండాకు తిరిగి వచ్చేది. ఒక వయస్సు వచ్చిన ఆమెకు వరుసకు బాబాయ్ అయ్యే అతను ఆమె పై కన్నేశాడు. యోగక్షేమాలు చూస్తాను అంటూ తరచుగా ఇంటికి వచ్చి లైంగిక దాడి చేసేవాడు. 

 

 ఆమె గర్భం దాల్చి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇక ఆమె పరిస్థితి తెలిసి నర్సాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఆమెను మాయమాటలలో ఉంచి నమ్మించి మోసం చేశాడు. ఇద్దరు దుర్మార్గులు ఆమె ఇంటికి వచ్చి అత్యాచారానికి పాల్పడుతూ ఆమెను హింసించేవారు. ఇద్దరి మగాళ్ళ చేతిలో ఇలా నలిగిపోతున్న ఆమె పరిస్థితి కూడా తండా వాసులకు చాలా నీచంగా ప్రవర్తించడం జరిగింది. ఇలాంటి ఈమె మన ఊర్లో ఉండకూడదు అని ఆమెను తండా నుంచి కూడా  బయటకు పంపేశారు. చేసిన తప్పేంటో కూడా తెలియని రేణుక గుంతకల్ మున్సిపల్ కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తన బిడ్డతో దిగులుగా కూర్చుని ఉండిపోయింది. 


ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఆమె అక్కడే సొమ్మసిల్లి పోయింది. ఈ సంఘటన గమనించిన కొందరు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీస్ అధికారులు ఆమెకు ఉన్న చోటికి వచ్చి వివరాలు సేకరించి ఐసిడిఎస్ అధికారికి ఆమెను అప్పగించడం జరిగింది. ఇక అధికారులు తల్లి కుమారుని ఇద్దరు కలిసి వృద్ధాశ్రమంలో చేర్పించారు.  ఆ మహిళను మోసం చేసిన ఆ దుర్మార్గుల ఇద్దరినీ కూడా పోలీసు అధికారులు గాలింపు చేస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: