మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధుల రాక్షసత్వాన్ని తీర్చుకుంటున్నారు.. పసికందుల నుంచి పండు ముస లాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు..పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎందరో చనిపోయారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళల్లో ఎటువంటి మార్పు రాలేదు.. 

 

 

 

 

 

కామపిశాచి రెచ్చిపోయాడు. మైనర్ బాలికపై పైశాచికానికి తెగబడ్డాడు. కామంతో కళ్లుమూసుకుపోయి ఒంటరిగా ఉన్న బాలికను పొదల్లోకి లాక్కెళ్లి దారుణంగా రేప్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరించడం మొదలుపెట్టాడు. మృగాడి వేధింపులు భరించలేకపోయిన బాలిక తండ్రితో కలసి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

 

 

 

 

 

 

 

జాల్వర్ జిల్లా ఖన్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను అదే గ్రామానికి చెందిన సద్దాం హుస్సేన్ పింజారా రేప్ చేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను పక్కకు లాక్కెళ్లి తలపై కత్తిపెట్టి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణ ఘటనను తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు..

 

 

 

 

 

 

 

 

ఆ యువతి మొత్తానికి దైర్యం చేసి జరిగిన విషయాన్ని  పెద్దలకు చెప్పింది..తండ్రి బాధితురాలి వెంటబెట్టుకెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా ఎస్పీని కలసి ఫిర్యాదు చేయడంతో విచారణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిని కోర్టు ఎదుట హాజరుపరచడంతో మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. నిందితుడి నుంచి బాలిక ఫొటోలు, వీడియోలు తీసిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.అతన్ని పోక్స్ కేసు కింద అరెస్ట్ చేశారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: