దేశంలో ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అందించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డినే. ఇది చెప్పుకోవడా నికి కాస్త అతియోశక్తిగా అనిపించ వచ్చేమో గాని ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అతి తక్కువ వయస్సులోనే సీఎం అయ్యి జగన్ చేపట్టిన సంస్కరణలు మాత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మవుతున్నాయి. జగన్ చేపడుతోన్న పథకాలు పెద్ద చర్చనీయాంశం గా మారుతున్నాయి. ప్రస్తుతం అందరూ జగన్ను పాలనను నిశితంగా గమనిస్తున్నారు.
కేవలం ఒక సంవత్సర కాలంలోనే ఊహించని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాసరే ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారు. అయితే జగన్ ఎంత చేస్తున్న టీడీపీ మాత్రం విమర్శలు చేస్తూనే ఉంది. కరోనా రాకపోతే ఏపీలో పాలనను జగన్ ఓ రేంజ్లో పరుగులు పెట్టించడంతో పాటు ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా చేసే వారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జగన్పై వరుస విమర్శల పరంపరలో మరో టీడీపీ నేత విమర్శలు సంధించారు.
తాజాగా కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రావణ.. రాక్షస రాజ్యం కొనసాగుతోందని, రాష్ట్రంలో హిట్లర్ పాసిజం పరాకాష్టకు చేరిందని, పోలీసులపైనే ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేస్తే సామాన్యులకు దిక్కెవరు? అని ప్రశ్నించారు.
ఇక కళా వెంకట్రావుపై వైసీపీ వర్గాలు కూడా మండిపడు తున్నాయి. గత చంద్రబాబు హయాంలోనే రాక్షస రాజ్యం నడిచిందని, అందుకే ప్రజలు జగన్ ని గెలిపించుకున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
పైగా గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలు, అధికారులపై దౌర్జన్యం చేసినప్పుడు కళాకు తెలియదా ? అప్పుడు నిద్రపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలోనే అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నారని చెబుతున్నారు. మరి దీనికి కళా ఏమని ఆన్సర్ ఇస్తారో ? చూడాలి.