దేశంలో రోజురోజుకీ అమానుష సంఘటనతహ ఎక్కువైపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులుగా దేశంలో చాలా అమానుష సంఘటనలు తగ్గాయని చెప్పవచ్చు. అయితే మూడో సారి లాక్ డౌన్ వచ్చినప్పటినుండి దేశంలో కొన్ని సడలింపులు సాగాయి. దీనితో మళ్లీ హింసాత్మక పనులు సాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక అసలు విషయానికి వస్తే... తన భార్య పై అనుమానం పెంచుకున్న తన భర్త ఆమె చేయి నరికేసిన దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

 


అయితే ఆ భర్త క్వారంటైన్ కేంద్రం నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీబిజీ రావడంతో అతడికి అనుమానం ఎక్కువయ్యి అక్కడి నుంచి ఎలాగో పారిపోయి వచ్చి తన భార్య చేయి  నరికేసాడు అతడు. దీంతో ఆమె చెయ్యి తెగి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న ఆమెను నువ్వు నాకు నమ్మకద్రోహం చేశావు అంటూ తీవ్రంగా మాట్లాడాడు. అయితే ఈ దారుణ సంఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది. 

 


చత్తీస్ ఘడ్ లోని జష్పూర్ జిల్లాకు చెందిన లలిత్  ఒక వలస కూలి. అయితే తను లాక్ డౌన్ కారణం చేత తన స్వగ్రామానికి తిరిగి రాగా అతనిని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే తాను అక్కడ ఉన్న సమయంలో తన భార్య ఫోన్ కి ఫోన్ చేయగా ఎప్పుడు బిజీబిజీ వచ్చేది. దీనితో భార్య ఎవరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుందని అతను అనుమానం పడటం మొదలు పడసాగాడు.


ఆ తర్వాత అక్కడి నుంచి తాను తప్పించుకొని వారి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో చేతిని నరికి వేశాడు. ఒకే ఒక్క దెబ్బతో అక్కడ ఉన్న గొడ్డలి తీసుకోని ఆమె కుడి చేతిని నరకగా అది తెగి కింద పడిపోయింది. అలా చేయి కింద పడి పోయిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి కనికరం చూపించకుండా అతని భార్యను అనరాని మాటలు అంటూ తీవ్రంగా దూషించాడు. 

 


అయితే వీరి రెండేళ్ల కొడుకు తల్లి చేయి నరకడం చూసి భయపడి పోవడంతో పెద్దగా ఏడ్చడంతో దగ్గరలోని స్థానికులు వచ్చి చూసి అక్కడ జరిగిన సంఘటన పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ తర్వాత ఆమెను హాస్పిటల్ కు పంపించిన రావడం లేట్ అవ్వడంతో ఆమె చేతిని అతికించే లేకపోయారు వైద్యులు. తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: