ప్రేమ చాలా పవిత్ర మైనది కానీ ఈ మద్య.. ఈ ప్రేమ అనేది యువత సరదా కోసం పూర్తిగా మారిపోయింది.  కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు.  తీరా వారికి కావలసిన అవసరాలు తీరిన తర్వాత ఎవరి దారి వారిదే..అయితే ఇప్పుడు కాస్త మారిందని చెప్పాలి .. వావి వరుసలు లేకుండా పోయింది.. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఘోరాలు బయట పడతాయి.. ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు బయటకు వస్తాయి. 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే ఓ వ్యక్తి తన ఫ్రెండ్ భార్యను ప్రేమించాడు.. నువ్వు లేకుంటే బ్రతకలేనని ఒట్టేసే చెప్పాడు.. అయితే తనకు పెళ్లి అయిందని అందుకు ఆ మహిళ ససేమిరా అంది.  దాంతో ఆమె భర్త జైలుకెళ్లడంతో ఇద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడింది. సడెన్‌గా లాక్‌డౌన్ విధించడంతో విరహ వేదనకు గురయ్యాడు. ఎలాగైనా ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలని తహతహలాడాడు. చివరికి ధైర్యం చేసి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను కలిసి ఇంటి నుంచి బయటికి వచ్చిన యువకుడు.. ఆమె ఇంటి ముందే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో వెలుగుచూసింది.

 

 

 

 

 

దేశ రాజధాని ఢిల్లీలోని సమీపంలోని కోట్ల ముబారక్‌పూర్‌కి చెందిన విక్కీ నార్త్ ఢిల్లీలోని నరేలా ప్రాంతానికి చెందిన వివాహితను ప్రేమించాడు.అయితే లాక్ డౌన్ పేరుతో ప్రజలు ఇళ్లకు పరిమిత మవ్వడంతో అతని ప్రేమ విరహ వేదనతో విల విల లాడింది.. దాంతో ఆమె ఇంటికి వెళ్లి తనతో బయటకు రావాలని కోరారు.. అందుకు ఆమె నిరాకరించింది.. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లి తనతో మాట్లాడి ఇంటి బయటకు వచ్చిన విక్కీ నాటుతుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎడమ భుజం కింద కాల్చుకుని కుప్పకూలిపోయాడు. విక్కీ ప్రేమను ఆమె తిరస్కరించడంతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విక్కీ ఆమె భర్త స్నేహితుడని.. అప్పుడప్పుడూ వాళ్లింటికి వచ్చి వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న విక్కీ ప్రియురాలి ఇంటి నుంచి బయటికొచ్చి తుపాకీతో కాల్చుకున్నాడని చెప్పారు.. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: