దేశంలో కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారిని తరిమేందుకు మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి వలస కార్మికులు తాము ఉన్నచోటే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కొంత మంది ధైర్యం చేసి కాలినడకన తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.  ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేశారు.  వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరుకునే వెసులు బాటు చేశారు.   ఈ నేపథ్యంలోనే ఆ మద్య ఔరంగా బాద్ లో రైలు దర్గటన జరిగింది.  ఇలా వలస కార్మికుల కష్టాలు ఒకటి రెండు కావు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.  తాజాగా ఓ వలస కార్మికుల కష్టాలు చూస్తే.. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికీ రావొద్దు దేవుడా అనుకుంటారు.

 

మంచంపై ఓ బాలుడిని పడుకోబెట్టి దాదాపు 1,300 కిలోమీటర్లు అతడి కుటుంబ సభ్యులు భుజాన మోసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఓ జాతీయ మీడియాకు లభ్యమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పంజాబ్‌లోని లుధియానా నుంచి సొంత గ్రామం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి ఆ కుటుంబం వెళ్లాలనుకుంది. అయితే, ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయమైంది.  లుధియానాలోనే ఉంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చని చేసేదేమీ లేక ఓ మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టి కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు.

 

ఇలా వారు దాదాపు 15 రోజులు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో పలు చోట్ల ఆగి ఆహారం తిని నిద్రపోతున్నారు.  నడిచీ నడిచీ వారి కాళ్లకు బొబ్బలు వచ్చాయి. వారు 15 రోజులు నడిచి యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు చేరుకున్నాక పోలీసులు వారి గురించి తెలుసుకుని ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపారు. పిల్లలతో పాటు  తాము మొత్తం 17 మంది సింగ్రౌలికి కాలినడకన వెళ్తున్నామని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది. 


  

మరింత సమాచారం తెలుసుకోండి: