ఈ మధ్యకాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హాయిగా సాగిపోతున్న జీవితంలో కి మూడో వ్యక్తి రావడంతో... అసలు కథ మొదలవుతుంది. దీంతో ఎన్నో అనుమానాలు మరెన్నో గొడవలు... ఇంకెన్నో చీదరింపులు.. ఇలా చివరికి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవడం లేదా... మూడో వ్యక్తి కోసం కట్టుకున్న వారిని కడతేర్చడం  లాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. 

 

 

 కట్టుకున్న బంధం కంటే... కేవలం అక్రమ సంబంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు నేటి సమాజంలో. అయితే తాజాగా అక్రమ సంబంధం నెపంతో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.అక్రమ సంబంధాన్ని వదులుకోలేక పోయిన ఇద్దరు ఏకంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధం గురించి ఇంట్లో తెలిసిందని... ఓ జంట ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాలనర్సు,  ప్రేమలత ఇద్దరూ వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు. 

 

 

 కొంతకాలం క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది అక్రమ అక్రమ సంబంధం గా మారి ఎన్నో రోజుల నుంచి ఇది కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అయితే బాలనర్సు కు  భార్య ఇద్దరు కుమారులు ఉండగా ప్రేమలత కు భర్త కుమారుడు ఉన్నారని స్థానికులు తెలిపారు. అక్రమ సంబంధం ఇంట్లో తెలిసింది అనే నెపంతో నే ఊరు శివార్లలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: