మద్యానికి బానిసై డబ్బు కోసం  నిరంతరం వేధిస్తున్న ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఒడిస్సా రాష్ట్రములో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బ్రహ్మపురం నగరంలో బ్రహ్మపుత్ర బజార్ జంగిలి వీధిలో బాణామాలి బెహరా, సునీత బెహరా దంపతులు ఇద్దరు జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ కవర్లను ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళ పేదరికానికి తోడు ఆ వ్యక్తి మద్యం మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం లేదు.

 

అంతేకాకుండా మద్యానికి డబ్బు కావాలని భార్యను నిత్యం వేధించే వాడు. ఇటీవల భార్యాభర్తలు ఇద్దరూ ఘర్షణ పడి ఆమెపై రోలుతో దాడి చేయడదానికి ప్రయత్నించాడు. దీనితో ఆమె భర్తను అడ్డుకోని కిందకు తోసే తరుణంలో రోలు అతడి తలపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోలు తన తలకు బలంగా తాకడంతో భర్తకి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనితో షాక్ కు గురి అయిన సునీత భర్తను చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్ళింది.

 

అయితే ఇక అప్పటికే ఆమె భర్త చని పోయినట్లు డాక్టర్ తెలియజేశారు. దీనితో సునీత భర్త ప్రమాదంలోనే చనిపోయాడు అని అందర్నీ నమ్మించింది. కానీ బాణామాలి శరీరంపై వేరే విధంగా గాయాలు ఉండటంతో వారు పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీనితో పోలీస్ అధికారులు సునీతాని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనితో సునీత అసలు నిజం బయటపెట్టాడు. ఆమెను అరెస్ట్ చేసి హత్యనేరం కింద కేసు నమోదు చేశారు. ఇక తండ్రి మరణం, మరోవైపు తల్లి జైలుకు వెళ్లడంతో ఐదుగురు పిల్లలు అనాధలు అయ్యారు. తాగుడుతో జీవితాలు నాశనం అవుతాయి అంటే ఇదొక ఉదాహరణ. కాబట్టి తాగుడు పూర్తిగా మానేయమని చెపితే ఎవరు వినరు కాబట్టి తాగడం తగ్గించి ఆ డబ్బులను మీ కుటుంబసభ్యుల కోసం వినియోగిస్తే మీరు, మీ కుటుంబసబులు ప్రశాంతగా జీవనం సాగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: