ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతూ వస్తుంది. లాక్ డౌన్ లో కొత్త సడలింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు..అన్నీ బంద్ కావడం తో చాలా వరకు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.. దాంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు కూడా ఇంటి నుంచే వ్యాపార పనులు కానీ చేస్తూ నష్టాలను పూరిస్తున్నారు. 

 

 

 

 

 

దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరాల్సి వచ్చింది. టెక్ దిగ్గజాలుగా పేరొందిన గూగుల్, ఫేస్ బుక్ సైతం అదే బాటలో నడుస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న తీరును గమనిస్తున్న గూగుల్, ఫేస్ బుక్ ఈ ఏడాది చివరి వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నాయి. అందుకే తమ ఉద్యోగులను డిసెంబరు వరకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి.

 

 

 

 

ఇక ఫేస్ బుక్ అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆఫీస్ లను మూసివేసింది.. జూలై 6 నాటికి కూడా ఫేస్ బుక్ కార్యాలయాలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దాంతో ఈ సంవత్సరం మొత్తం ఇంటి నుంచే పని చేసుకోవచ్చంటూ ఉద్యోగులకు సూచించామని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గూగుల్ పరిస్థితి కూడా అందుకు భిన్నం కాదు.

 

 

 

 

 

 

ఇకపోతే ఇటీవల జరిగిన గూగుల్ మీటింగ్ లో  గూగుల్ సీఈఓ ఫేస్ బుక్ ఫాలో అవ్వాలని పిలుపు నిచ్చారు.. ఈ ఏడాది వరకు ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించారు..అంతేకాదు, గూగుల్ మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గూగుల్ ఉద్యోగులకు వేతనంలో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే, ఇంటి నుంచి పనిచేసే కాలంలో ఈ ప్రోత్సాహకాలను నిలిపేయాలని నిర్ణయించింది.. ఈ ఏడాది చివరి వరకు కూడా ఇంట్లోనే ఉంటూ పని చేయాలని నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: