మన దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరింత కాలం పొగిడిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఉన్నా కూడా కరోనా ని పెరుగుదల మాత్రం అరికట్టలేకపోతున్నారు. నేటి తో లాక్ డౌన్ ముగిసింది.. రేపటి నుంచి 4.0 మొదలవుతుంది. ఇక కరోనా సిమిటమ్స్ ఉన్నవారికి క్వారంటైన్ విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారితో జనాలు హడలి చస్తుంటే ఓ వ్యక్తి దెయ్యం పట్టినట్టు శ్రీకాకుళం జిల్లాలోని ఓ క్వారెంటైన్ సెంటర్లో హల్చల్ చేశాడు. క్వారంటైన్ సెంటర్లో ఉన్న మిగతావారు ఆందోళన చెందారు. విశాఖ, నెల్లూరు, గుంటూరు లాంటి వేర్వేరు ప్రాంతాల నుంచి వెనక్కు వచ్చిన 45 మంది శ్రీకాకుళం వాసులకు సంతబొమ్మాళి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ అంటే మరోలా భావిస్తున్నారు కొంత మంది.. ఈ సమయంలో టెస్టులు.. కండీషన్లతో ఇబ్బందులు పెడుతున్నారని.. ఐన వారిని కలవకుండా చూస్తున్నారని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు.
తమకు కరోనా లేదని నర్ధారణ అయింతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. ఇంతలో అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి పెద్ద పెద్ద అరుపులు, వింత కేకలు చేశాడు. దెయ్యం పట్టినట్లు పూనకం బూనాడు. పిచ్చి పిచ్చి చేష్టలతో రచ్చ రచ్చ చేశాడు. ఇంకే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే చీపురుకట్టల ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ తలా ఒక దెబ్బ వేయడంతో ఆ వ్యక్తికి ఒళ్లు హూనం అయి పోయింది. గట్టిగా పట్టుకుని వెళ్లి సమీపంలోని ఓ ఆలయంలోకి తోసి బయటినుంచి తలుపులు వేసేశారు.
కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి పారిపోయి దాచుకున్నాడు. కొద్దిసేపు అనంతరం ఆ వ్యక్తి దెయ్యం పారిపోయినట్టు సాధారణ స్థితికి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఎవరూ భయ భ్రాంతులకు గురికావద్దని ధైర్యం చెప్పారు.