ఈ మధ్య  స్వదేశం గురించి పొగిడే వాళ్ళకంటే.. విదేశాల గురించి గొప్పగా వారే ఎక్కువ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి వాళ్ళైతే విదేశాలలో ఉండే జీవన శైలి  ఏకంగా స్వర్గధామంగా వర్ణిస్తూ ఉంటారు. అదే సమయంలో భారత్లో ఉన్న జీవనశైలిని ఒక నరకం చెబుతూ  ఉంటారు. అయితే ఇతర  దేశాల మీద ప్రేమ ఉండటం మంచిదే కానీ అది స్వదేశంపై ద్వేషంగా మారటం  మాత్రం మంచిది కాదు. భారత్ లో పుట్టి  ఏకంగా భారతదేశాన్ని అవమానించడం అంటే మనల్ని మనం అవమానించడం. గతంలో ఓ యువతి కరోనా  వైరస్ నేపథ్యంలో ఇండియా గురించి తప్పుగా మాట్లాడితే ఆ యువతిని రెండు రోజుల్లో మానసికంగా ఇబ్బంది పెట్టి   క్షమాపణలు చెప్పేలా  చేశారు. 

 


 అయితే ఆ సందర్భంలో కొన్ని మెయిల్స్ తో సంచలనం సృష్టించిన కేఎఫ్  గురు అనే వ్యక్తి తాజాగా మరో ఒక మెయిల్ పెట్టారు. అంతకుముందు అని చెప్పింది ఏమిటంటే అమెరికాలో తనకు 10 రెస్టారెంట్లు ఉన్నాయి అని అమెరికా జీవితం ఎంతో విలాసవంతమైనది  అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన పెట్టిన మెయిల్ లో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వ్యక్తి. 1983 ఎన్టీఆర్ తో కలిసి టీడీపీ పార్టీలో పని చేశానని గుర్తు చేశారు. ప్రస్తుతం మాత్రం టీడీపీ గురించి విమర్శిస్తున్నారు. అయితే నాకు చంద్రబాబు అంటే లెక్క లేదు కానీ టిడిపి అంటే ప్రేమ మాత్రం ఉంది అంటూ చెబుతున్నారు. 

 


 అదే సమయంలో తన భార్య క్రిస్టియన్ కాబట్టి తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా 30 సంవత్సరాల క్రితం కొందరు రాజకీయ నాయకులు అడుక్కొని పైకి వచ్చారు అంటూ తన మెయిల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ ఇష్టమైనప్పుడు టిడిపి బాగుపడేలా  పలు సూచనలు చేయాలని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా  తన భార్య క్రిస్టియన్ కాబట్టి జగన్ ను  అభిమానించటం ఏమిటి ... అలా అయితే కేవలం జగన్ను క్రిస్టియన్స్ మాత్రమే అభిమానించాలా  అంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: