మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీలు ప్రారంభమయ్యాయి. రాయలసీమకు నీటి కోసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే విషయంపై మాటల యుద్ధం మొదలైంది. అయితే సీమ విషయంలో కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు వైసీపీ నాయకులు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే సీమకు నీటి కష్టాలు పోతాయని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.

 

 

రాయలసీమ వాసులకు నీటి కష్టాలను పాలద్రోలేలా దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రవేశ పెట్టారన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆయన హయాంలో తెలంగాణ లో 60 శాతం ప్రాజెక్టులు నిర్మిస్తే 40 శాతం ప్రాజెక్టులు రాయలసీమలో నిర్శించారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు ఉన్నాయంటున్నారు.

 

 

ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయమై ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌ రెడ్డి కోరారు. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప నీటి సమస్య తీర్చలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకొని చంద్రబాబు అండ్‌ కలెక్షన్స్‌ చేశారు. చంద్రబాబు చేసిన పనులను చరిత్ర క్షమించదు. పార్టీలు ద్వంద రాజకీయాలు మానుకొని రాయలసీమ వాసుల నీటి కష్టాలు పోయేలా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.

 

 

తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తి మనకెందుకు రావడం లేదు. సీఎం వైయస్ జగన్ చేస్తున్న పనులకు ప్రతిపక్ష పార్టీలు స్వాగతించి మద్దతు ఇవ్వాలి. ఈ జీవోను అడ్డుకుంటే భవిష్యత్‌లో ప్రజలు ఉద్యమాలు చేయక తప్పదని ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లోనూ రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. మిగులు జలాల విషయంలోనూ రాయలసీమ వెనుకబడి ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన విధంగా 511 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం లేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయని గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: