గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలకు మరియు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబుకు మరియు టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు విషయం గురించి అనిల్ కుమార్ యాదవ్ 70% పనులు టిడిపి పూర్తి చేస్తే నేను మీసం గొరిగిచ్చుకుంటా ఈ చాలెంజ్ విసిరారు. దీనికి దేవినేని ఉమా మరియు మరి కొంతమంది టిడిపి నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కి కౌంటర్లు వేయటం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే CBN ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో కొంతమంది అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి దారుణంగా కామెంట్ చేస్తున్నారు.

 

గత కొన్ని రోజులుగా సిబిఎన్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో వైసిపి పార్టీ పై మరియు ప్రభుత్వంపై విపరీతమైన అసత్య ఆరోపణలు, అడ్డగోలు విమర్శలు అవగాహన లేని పోస్టులు ఇంకా లేనిపోని కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ CBN ఆర్మీ కి ఓపెన్ చాలెంజ్ విసిరాడు. “విదేశాల్లోనో, చీకటి గదుల్లోనో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సీబీఎన్ ఆర్మీ వ్యక్తులకు దమ్ముంటే… ఫేస్ టు ఫేస్ రావాలని సవాల్ విసిరారు!.

 

కాగా ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ సీబీఎన్ నుంచి కానీ సీబీఎన్ ఆర్మీ నుంచి కానీ స్పందన రాలేదు!. ఇదే సమయంలో పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో టిడిపి స్పందన ఏమిటో చంద్రబాబు దేవినేని ఉమా చెప్పాలని ఎన్నిసార్లు ప్రశ్నించిన ఎందుకు మాట్లాడటం లేదని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన చంద్రబాబు, నారా లోకేష్ కృష్ణానది కరకట్ట వద్ద ఆక్రమించిన ఇంటిలో కూర్చుని సమాధానం ఇవ్వండి అని విమర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: