ప్రస్తుత రోజులలో అమ్మాయిలపై ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటే సొంత కుటుంబ సభ్యులే వారిని దారుణంగా హత్య చేసే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి పాకిస్తాన్ లో చోటు చేసుకోవడం జరిగింది. పాకిస్థాన్ దేశంలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. ఒక అబ్బాయితో ఇద్దరు బాలికలు మాట్లాడారు అన్న కారణంతో కుటుంబ సభ్యులే వారిద్దరిని కాల్చి చంపేసిన సంఘటన చోటు చేసుకుంది. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... పాకిస్తాన్ లోని ఉత్తర వాయువ్య గిరిజన ఈ ప్రాంతంలో ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. మే 14న ఇద్దరు బాలికలు సొంత కుటుంబ సభ్యులతోనే హత్యకు గురి అవ్వడం జరిగింది. హత్యకు కంటే ముందు కొన్ని రోజుల క్రితం వీరిద్దరు కూడా ఒక యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో వారి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఇద్దరి బాలికను చంపేసినట్లు పోలీస్ విచారణలో బయటకు వచ్చింది. ఇక హత్య చేసిన నిందితులలో ఒకరు బాలిక తండ్రి అవ్వగా మరొకరు బాలిక సోదరుడిగా గుర్తించారు.

 


ఇక ఆ వీడియో లో కనిపిస్తున్న మూడో బాలిక యువకుడికి ప్రాణహాని ఉంది అని పోలీసులు గుర్తించి వారి ఇద్దరికి భద్రత కల్పించడం జరిగింది. ఇలాంటి పరువు హత్యలపై స్థానికంగా అనేక సంఘాలు మండి పడటం జరిగాయి. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘ అధికారులు డిమాండ్ చేయడం జరిగింది. వాస్తవానికి పాకిస్థాన్ లో ఏడాదికి వెయ్యి పైగా మంది పరువు హత్యలకు గురి అవుతున్నట్లు నివేదికలో వెల్లడయ్యాయి. నిజానికి ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఏదో మూలన రోజుకు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రవర్థించేవారిని ఆ దేవుడే కాపాడాలి ప్రపంచాన్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: