సోషల్ మీడియాలో ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా ప్రభావితం చేస్తున్న యాప్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది టిక్ టాక్. అప్పటి వరకు ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్ యాప్స్ ని  వెనక్కి నెట్టేసి తెరమీదకు వచ్చేసింది  ఈ యాప్. ఇక ఈ యాప్ ద్వారా సరికొత్త ఎంటర్టైన్మెంట్ దొరకటం...  అంతే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి టాలెంట్ ఇక్కడ చూస్తుండటం తో నెటిజనులు ఈ టిక్టాక్ ఎంటర్టైన్మెంట్కి బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే గాని టిక్ టాక్ ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టింది. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యింది . ఇక ఎంతో మంది మరణానికి కూడా టిక్ టాక్ కారణంగా మారిపోయింది. 

 

 అయితే ఈ ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా జరిగిన మంచి కంటే చెడు ఎక్కువ ఉంది అని చెప్పాలి. ఇక తాజాగా టిక్ టాక్ ఏకంగా తల్లీ కొడుకులను బలితీసుకుంది. టిక్ టాక్ కారణంగా  తల్లి కొడుకులు చనిపోవడంతో స్థానికంగా విషాదం నిండిపోయింది. విజయవాడ నగరంలోని వైయస్సార్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైస్సార్  కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవలే భార్య టిక్ టాక్ యాప్ ఉపయోగించడం రోజురోజుకు ఎక్కువైపోయింది . దీంతో తన భార్య టిక్టాక్ యాప్ కి బానిస గా మారి పోతుంది అని గ్రహించిన భర్త... భార్యను తీవ్రంగా మందలించాడు.  దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.

 


 ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న  సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న కొడుకు గుండె పగిలిపోయింది. దీంతో తల్లి మరణం తో ఎంతగానో కుంగిపోయి మనస్థాపానికి గురై  బలవంతంగా ప్రాణాలు విడిచాడు. ఈరోజు ఉదయం సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన కొడుకును వెంటనే  ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఇక ఒకేరోజు తల్లి కొడుకుల చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: