ఇల్లు తన పేరున రాయ లేదన్న కోపంతో తన కన్నతల్లి నగ్న ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేసి ఆమెను ఎంతో మభ్య పెట్టిన ఓ యాభై ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం అందరి ఆగ్రహానికి గురి అవుతున్నాడు. ఈ సిగ్గుమాలిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే దీపక్ తివారి అనే 50 ఏళ్ల వ్యక్తి తన అమ్మ నగ్న చిత్రాలను తన బంధువుల వాట్సాప్ గ్రూప్ చాట్ లో షేర్ చేశాడు. పోలీసులు చెప్పిన ప్రకారం తన పూర్వీకుల ఇంటికి సంబంధించిన పత్రాలపై తనకు చెందినట్టు సంతకం చేయాలని తన అమ్మను బ్లాక్ మెయిల్ చేశాడు దీపక్. ఆ ఇల్లు శివపురి ఏరియాలోని దాదాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇరవై రోజుల క్రితం దీపక్ తివారి తండ్రి చనిపోవడంతో తన 75 ఏళ్ల తల్లిని పీక్కు తినడం ప్రారంభించాడు దీపక్ తివారి. 


మే 13వ తారీఖున దీపక్ తివారి తల్లి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఈ విధంగా ఫిర్యాదు చేసింది. నేను చనిపోయిన నా భర్త కి శాంతి చేకూరాలని పూజ చేస్తున్న సమయంలో నా కొడుకు వెనుక నుంచి వచ్చి ఏదో ద్రావణం నాపై చల్లాడు. నాకు అప్పుడు బాగా దురద పుట్టింది. వెంటనే బట్టలు విడిచి స్నానం చేయడానికి వెళ్లాను. స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకొని లోపల కూర్చున్నాను' అని ఆమె పేర్కొంది. 


అయితే ఆమె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రబుద్ధుడు రహస్యంగా కన్నతల్లి నగ్న ఫోటోలను తీశాడు. సభ్యసమాజం తలదించుకునేలా ఆ కొడుకు తన బంధు మిత్రుల వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయగా... ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన ఆ బంధువులు వెంటనే ఆ తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు పై ఫిర్యాదు చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇల్లు తన పేరున రాయకపోతే తన ఫోటోలను అందరికీ షేర్ చేస్తానని 50 ఏళ్ల దీపక్ తివారి బ్లాక్మెయిల్ చేయడం ప్రస్తుతం అందరినీ విస్మయానికి కారణం అవుతుండగా... అతనిపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 509 ఎ, 509 బి (మహిళల నమ్రతని అధిగమించడం), ఐటి చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: