లాక్ డౌన్ కొనసాగుతున్న కొన్ని రకాల పనులు జోరుగా సాగుతున్నాయి..అదేంటంటే ఒక మాట జనాల మధ్య వినపడుతుంది.. హైటెక్ వ్యభిచారం సిటీలో  ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. పేరుకే మసాజ్ సెంటర్ లోపల మాత్రం వ్యభిచారం.. 

 

 


వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరులో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా రట్టయింది. కోట్టార్‌లో నిర్వహిస్తున్న ఓ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం అందింది. దీనిపై విచారణ చేయాలని ఏఎస్పీ జవహర్‌‌కు ఆదేశించారు. సిబ్బంది ద్వారా అక్కడ వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న ఏఎస్పీ సోమవారం ఆకస్మికంగా రైడ్ చేశారు.

 

 


ఈ మేరకు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు వారు వెల్లడించారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి అందులో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ యువకులను ఆకర్షిస్తున్నాడు.

 

 


అలా మొదలైన ఆ మసాజ్ లో  అమ్మాయిల కోసం వచ్చే యువకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏఎస్పీ విచారణలో ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అలెగ్జాండర్ వద్దకు వచ్చే విటుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలిసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విటులను పట్టుకొనే పనిలో ఉన్నారు..లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా అక్కడ దందా జోరుగా సాగుతుంది అని తెలుస్తుంది.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: