కాలం పెరిగింది.. సైన్స్ బాగా పెరిగింది... అయిన కూడా మూఢ నమ్మకాలు మాత్రం ఎక్కడ తగ్గలేదు.. మంత్రాలతో రోగాలు పోతాయని చాలా మంది ఇప్పటి కీ నమ్ము తుంటారు.. అలానే డబ్బులు వదిలించుకొని మరి లేని పోని కలహా  లను తెచ్చు కుంటారు.. సైన్స్ ఎక్స్ప్రెస్ లాగా దూసు కెళ్తున్న కూడా నమ్మకాలు అనేవి రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ గా ముందు కెళ్తున్నాయి.. 

 

 

 

అసలు విషయాని కొస్తే.. బీపీ పెరిగిందని మహిళ మంత్ర గాడి దగ్గరి కెళ్తే శ్మశానం లోకి తీసుకెళ్లి రేప్ చేసిన దారుణ ఘటన రాజస్థాన్‌ లో చోటు చేసుకుంది. బర్మేర్ జిల్లా ధోరిమన్న ప్రాంతాని కి చెందిన మహిళ కొద్ది రోజులు గా హైబీపీతో బాధ పడుతోంది. తల నొప్పి.. టెన్షన్ ‌గా ఉంటుండడం తో ఆమె భర్త, కుటుంబ సభ్యులు మంత్రగాడు లాధురామ్ వైష్ణోయి దగ్గరికి తీసు కెళ్లారు. అతను ఓ కొబ్బరి కాయ చేతి లో పెట్టి ఆమె పడుకో ప్రదేశం లో కట్టమని చెప్పి పంపించాడు.

 

 

 


అలా ఏవేవో చెప్పి మోసం చేశాడు.. ఆమె ఊరెళ్ళి రావడంతో  ఆత్మ అవహించింది.. అంటూ ఏదేదో చెప్పే శాడు..ఆ ఊరి శ్మశానం లో పూజలు చేయాలని చెప్పి నమ్మించి మహిళ, ఆమె భర్త, అతని సోదరుడి ని వెంట బెట్టుకుని వెళ్లాడు. శ్మశానం లో పూజలు చేసే సమయంలో ఎవరూ ఉండకూడదని చెప్పి ఆమె భర్త.. బావకి వేరే పనులు పురమాయించాడు.అలా ఆమెను స్మశానాని కి తీసుకెళ్ళి రేప్ చేశాడు.. జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్ప గా ఇద్దరు వెళ్లి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మంత్రగాడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: