గత రెండున్నర గంటల్లో, జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో తరగతి ప్యాసింజర్ రైళ్ల కోసం 4 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు చాలా మంది ఇంటికి వెళ్లాలని కోరుకుంటారని... అలాగే, నగరాల్లో తిరిగి పని చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారని.. ఇది చాలా మంచి సంకేతమ‌ని రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ సంఖ్య‌ను చూస్తే.. రైల్వే ప్ర‌యాణానికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం అవుతుంది. కాగా, జూన్ ఒక‌టో తేదీ నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే శాఖ బుధవారం వెల్లడించిన విష‌యం తెలిసిందే. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు  ఉన్నాయి. ఇందులో తెలంగాణ రైళ్లు ఇలా ఉన్నాయి..

 

ఢిల్లీ-హైదరాబాద్‌: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై-హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-సికింద్రాబాద్‌: ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్‌-డనపూర్‌ సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు-సికిం ద్రాబాద్‌: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-నిజామా బాద్‌: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌. ఇక రైల్వేశాఖ ఈ క్రింది సూచ‌న‌లు చేసింది. గరిష్ఠంగా 30 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. మాస్క్‌ ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతినిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. కన్ఫర్మ్‌ అయితేనే రైల్లోకి అనుమతిస్తారు. ఈ నేప‌థ్యంలో రైల్వే ప్ర‌యాణికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపుగా మార్చి వివ‌రివారంలో రైళ్ల రాక‌పోక‌లు బంద్ అయ్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: