భార్య భర్తల మధ్య కీచులాటలు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. నువ్వెంత అనే ఆలోచన వస్తుంది.. దీంతో ఏదైనా కూడా చివరికి విడిపోయే వరకు తీసుకొస్తుంది.. అందుకే వారి మధ్య చిన్న గొడవలు ఉన్నప్పుడే సర్దుకోవాలి చెప్తున్నారు..ఇకపోతే సుఖంగా సాగుతున్న సంసారంలో అక్రమ సంబంధం అడ్డొస్తే వాటికి ఎదుర్కోవలసిన పరిణామాలు చాలా దారుణంగా మారుతాయి అన్న విషయం తెలిసిందే.. 

 

 

 

అయితే, ఓ భార్య భరపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది తీరా చూస్తే ఉరి శివారులో శవమై కనిపించింది..వివరాల్లోకి వెళితే..భర్తతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఓ మహిళ అనుమనాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన నాగమణి(30)కి అదే మండలం నాయుడుపాలేనికి చెందిన బొచ్చు ప్రసాద్‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ నెల 17న వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో మనస్తాపం చెందిన నాగమణి 18వ తేదీ ఉదయం ఎవరూ లేని సమయంలో నాగమణి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది.

 

 

ఆమె ఆచూకీ లభించకపోవడంతో 19న భర్త చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో చండ్రపాలెం సమీపంలోని ఓబీసీ కాలువలో బుధవారం నాగమణి మృతదేహం బయట పడింది. ఆమె తండ్రి చెన్నుబోయిన వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాగమణి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఆ రిపోర్ట్స్ వచ్చాకే అసలు సంగతి తెలుస్తుందని తేల్చి చెప్పారు.. ఆమె మృతి వెనక అనేక  కారణాలు పోలీసులకు తగలడంతో ఆ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: