క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగ‌డం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో ఎన్నో చిత్ర విచిత్రాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. మ‌న దేశంతో పాటుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా వివిధ ఘ‌ట‌న‌లు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. కొన్నింటిని చూస్తుంటే బాధ క‌లుగుతోంది. అయితే, ఇంకొన్ని చిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఇదిగో ఈ రెండు ఘ‌ట‌న‌లు అలాంటివే. అయితే రష్యాకు చెందిన ఒక న‌ర్సు చేసిన ప‌ని ఇప్పుడు వార్త‌ల్లోకి ఎక్కింది. త‌న బామ్మ‌ను కౌగ‌లించుకోవ‌డానికి ఓ వ్య‌క్తి చేసిన ప‌ని సైతం వైర‌ల్ అయింది.

 

వివ‌రాల్లోకి వెళితే..రష్యాకు చెందిన ఒక న‌ర్సు చేసిన ప‌ని ఇప్పుడు వార్త‌ల్లోకి ఎక్కి వైర‌ల్ అయింది. క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు, న‌ర్సులు పీపీఈ కిట్ల‌ను ఉప‌యోగించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. వైద్య సేవ‌ల్లో భాగమైన వారందరూ తమ దుస్తులపైనే పీపీఈ కిట్లను ధరిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ర‌ష్యాలోని టులా న‌గ‌రానికి చెందిన ఒక ఆస్పత్రిలో ఓ 20 ఏళ్ల  యువ‌తి న‌ర్సుగా సేవ‌లు అందిస్తున్న స‌మ‌యంలో తన దుస్తులపై నుంచి పీపీఈ కిట్ ధరించడం కష్టంగా అనిపించిందట‌. ఉక్కపోతగా ఉందంటూ డ్రెస్సును పక్కన పడేసి కేవలం లోదుస్తులను మాత్రమే ఉంచుకుని, వాటిపై పీపీఈ కిట్‌ను ధరించింది. అయితే పీపీఈ కిట్ నుంచి తన శరీరం క్లియర్‌గా బయటకు కనిపిస్తున్నా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే వేషధారణతో వార్డువార్డుకు తిరుగుతూ కరోనా రోగులకు సేవలు అందించింది. ఆమె నిర్ణ‌యానికి ఆస్పత్రి యాజ‌మాన్యం కూడా అడ్డు చెప్పలేదు. కానీ... న‌ర్సు వేష‌ధార‌ణ‌కు బిత్త‌ర‌పోయిన‌ ఓ క‌రోనా పేషెంట్ మాత్రం ఆమెను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం దారుణమంటూ తిట్టి పోస్తున్నారు. ఈ విష‌యం ఆ దేశ‌ ఆరోగ్య శాఖ చెవిన కూడా ప‌డ‌టంతో సదరు నర్సుపై  క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కింద చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

 

ఇక మ‌రో ఉదంతంలో.... ఆంటోనీ కావిన్ అనే వ్య‌క్తికి త‌న బామ్మను హత్తుకోవాలని అనిపించింది. అయితే, కరోనా భ‌యం ఉండంటంతో ఓ క‌ర్టెన్ తయారు చేశాడు. నిలువెత్తు ప్లాస్టిక్ కర్టెన్‌కు చేతులకు వేసుకునే పొడవాటి గ్లౌజ్ తగిలించాడు. దాంట్లో నుంచి తనకు ఎంతో ప్రియమైన బామ్మను గాట్టిగా వాటేసుకున్నాడు. ఈ వీడియో కావిన్, అతని భార్య మిరియం ముందుగా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. కడిల్ కర్టెన్ అని పిలిచే ఈ తెరకు అటూఇటూ నిల్చుని బామ్మ, మనుమడు కావలించుకోవడం నెట్‌లో వైరల్ అయింది. 56 లక్షల మంది ఈ వీడియోను చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: