కరోనా విషయంలో ముందుగా జగన్ నోరు విప్పితే అంతా ఎగతాళి చేశారు. జగన్ కు కరోనాపై కనీసం అవగాహన లేదని మండిపడ్డారు. ఇక ప్రతిపక్షాలైతే మరీ దారణం. అలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని విపక్షనేత చంద్రబాబు ఫుల్లుగా విమర్శించారు. కానీ ఆ తర్వాత జగన్ చెప్పిందే అంతా చెబుతూ వచ్చారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి సుచరిత గుర్తు చేస్తున్నారు.

 

 

కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని హోంమంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు. వైరస్‌ కట్టడి అయ్యే వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే కొందరు అవహేళన చేశారని, కానీ, నేడు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా అదే చెబుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరితో కలిసి హోం మంత్రి మేకతోటి సుచరిత దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా పండ్లు, భోజన ప్యాకెట్లు అందజేశారు.

 

 

కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారని హోం మంత్రి మేకతోటి సుచరిత గుర్తు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామని సుచరిత అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని హోంమంత్రి సుచరిత అన్నారు.

 

 

కరోనా కాలంలోనూ వ్యవసాయ రంగాన్ని కూడా జగన్ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఎవరూ ఇబ్బంది పడకుండా విడతల వారీగా రేషన్‌ పంపిణీ, ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. ఏదేమైనా మొదట్లో జగన్ చెబితే సెటైర్లు పేల్చినవాళ్లే ఇప్పుడు ఆయన మాటే అక్షరాలా వాస్తవం అని అంగీకరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: