ప్రస్తుత రోజులలో అమ్మాయిలపై అఘాయిత్యాలు చాలా ఎక్కువ అయిపోయాయి. ప్రతి చిన్న విషయానికి ఆడవారి పై విరుచుకుపడుతున్నారు మగవాళ్ళు. ఈ తరుణంలోనే జీతం డబ్బులు అడిగినందుకు భార్యను హత్య చేశాడు ఒక భర్త. విషయం బయటకు వస్తుంది అని ఆత్మహత్య పేరుతో హైడ్రామా మొదలు పెట్టడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలోని కుషాయిగూడ లోని ఏఎస్ రావు నగర్లో నివాసముంటున్న సంతోష్ ఒక వ్యాపారి పరమేష్ పాటిల్ దగ్గర పని చేస్తున్నాడు.

 

IHG

భార్య దీపాలి చౌహన్ జీతం డబ్బులు విషయంపై సంతోష్ తో గొడవ పడడం జరిగింది. ఈ తరుణంలోనే దీపాలి తన భర్త పై వంటగదిలో ఉన్న పట్టకారను తీసుకోని సంతోష్ పై విసిరింది. దీనితో సంతోష్ కు కోపం వచ్చి భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత దీపాలి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. కొంత సమయానికి తన భార్య ఆత్మహత్య చేసుకుంది అని స్నేహితులకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్​ యజమాని పరమేష్​ కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి పోలీసు అధికారులు చేరుకొని సంతోష్ అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. విచారణలో అసలు విషయం బయటకు తెలియజేశారు సంతోష్. దీనితో సంతోష్ పై కేసు నమోదు చేసి... పోలీస్ అధికారులు సంతోష్ ని అరెస్ట్ చేయడం జరిగింది.


ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భార్య భర్తలు గొడవ పడటం సహజమే కానీ, మరి ఇంతలా ప్రాణాలు తీసివేసేంత చేయడం చాలా తప్పు. కాబట్టి జాగ్రత్త ఉండటం చాలా మంచిది. మీరు దురుసుగా ప్రవర్తిస్తే ఎదుటివారు కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మాత్రం మరవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: