దేశంలో ఎన్ని నిర్భయ లాంటి సన్నివేశాలు జరిగినా కొందరు దుర్మార్గులు మాత్రం మారడం లేదు. కంటికి బాగా కనిపిస్తే చాలు... వారిపై బరితెగించేస్తున్నారు కొందరు కామాంధులు. దీనితో వారి ప్రాణాలు తీసివేయడం లేకపోతే వారిని బెదిరించి వారి కార్యకలాపాలను కొనసాగించడం అలాంటి పనికిమాలిన సంఘటనలు దేశంలో రోజూ ఏదో ఒక మూలన చూస్తూనే ఉన్నారు. అయితే ఇక అసలు విషయంలోకి వెళితే....


బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ పై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన అక్కడ జరిగింది. అయితే ఈ విషయంపై సదరు ప్రిన్సిపాల్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ గతి తప్పాడు. తనతో పాటు పని చేస్తున్న మహిళా టీచర్ పై కన్నేశాడు ఆ దుర్మార్గపు ప్రిన్సిపాల్. తోటి ఉపాధ్యాయురాలుతో తన కామ వాంఛ తీర్చుకోవాలని ఆమెతో సాహిత్యం మొదలుపెట్టాడు మొదట్లో. ఆ మాయ మాటలు నమ్మి ఆమెను లొంగదీసుకున్నాడు.


ఇక ఆ మాయ మాటలు నమ్మిన టీచర్ ప్రిన్సిపల్ చెప్పినట్లుగా చేయడం చేస్తోంది. ఇదే క్రమంలో ఆ టీచర్ పోయిన వారం తన ఇంటికి రమ్మని చెప్పాడు. అయితే ఇంటికి వెళ్ళగానే ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమెకు తాగించడం జరిగింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ప్రిన్సిపాల్. ఆ విషయం తెలుసుకున్న టీచర్ నిలదీయగా నేను చెప్పినట్లు వినాలని ప్రిన్సిపాల్ బెదిరించాడు. అలా చేయకపోతే అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియో లను సోషల్ మీడియాలో పెడతాను అంటూ ప్రిన్సిపాల్ బెదిరించాడు. అయితే ఈ విషయంపై తనను నమ్మించి మోసం చేసిన ప్రిన్సిపాల్ ను పోలీసులకు అప్పగించింది సదరు టీచర్. తనను నమ్మించి మోసం చేసిన ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడని అతనిపై కేసును నమోదు చేసింది ఆ టీచర్. దీనితో సదరు ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: