ఇద్దరూ ప్రేమించుకున్న విషయంలో అమ్మాయి అన్న విలన్  గా మారిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక అసలు విషయంలోకి వెళితే... వారిద్దరు ఇంటర్ మీడియట్ చదువుతుండగా క్లాస్ మేట్స్. అలా పరిచయం అయిన వారిద్దరూ కొద్ది రోజులకు వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ సదరు యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది. దీంతో కక్ష పెంచుకున్న ఆ అమ్మాయి సోదరుడు చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద జరిగింది. 


అయితే ఈ విషయంపై సదరు ఏరియా ఎస్ఐ రఘుపతి ఈ విషయాలను తెలియజేస్తూ... కోన్నే గ్రామానికి చెందిన కొమరమ్మ తిరుపతి దంపతులకు మొత్తం ముగ్గురు కుమారులు. ఇకపోతే కొమరమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి బతుకుదెరువు కోసం ముంబై కి వెళ్లగా రెండో కుమారుడు శ్రీధర్ కి మాత్రం అమ్మమ్మ వద్ద ఇక్కడే ఉండి చదివిస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి శ్రీధర్ తో కలిసి ఇంటర్మీడియట్ చదివే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఆ యువతి హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ తీసుకుంటుండగా, శ్రీధర్ హైదరాబాద్ లోని ఒక హోటల్ లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వీరిద్దరూ వారి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇలా ఊరికి వచ్చాక వారిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది.


ఇక దీనితో ఆ కుటుంబ సభ్యులు శ్రీధర్ తో పాటు అతని తాతని కూడా బెదిరించారు. ఇకపోతే తాజాగా ఆ యువతికి పెళ్లి నిశ్చయించారు. ఆ విషయం తెలుసుకున్న శ్రీధర్ ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నువ్వు తనని పెళ్లి చేసుకోవద్దని కోరాడు. దీనితో ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఈ విషయం పై ఆ కుటుంబ సభ్యులు శ్రీధర్ పై కక్ష పెంచుకున్నారు. అయితే శుక్రవారం నాడు ఉదయం మోటార్ సైకిల్ పై వెళ్తున్న శ్రీధర్ ను ఆ యువతి సోదరుడు శివ కుమార్ మెయిన్ రోడ్డు పై ఒక ఆటోతో ఢీ కొట్టగా అతను కింద పడ్డాడు. ఇక ఆ తర్వాత శ్రీధర్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు శివకుమార్. ఈ విషయంలో పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: